మనసంతా సేవ.. ఊరంతా వెలుగు..
పుట్టి పెరిగిన ఊరిపై ఆయన చూపిన మమకారం ఆ పల్లెకు వెలునిచ్చింది. ఒకప్పుడు వీధి దీపం వెలుగులో చదివి, డొంక రహదారిపై ఐదు కిలోమీటర్ల నడక సాగించి తండ్రి సూచన మేరకు కష్టపడి చదువుకుని ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన కన్నతల్లి వంటి సొంతూరికి మేలు చేశారు.
విద్యుత్తు ఉప కేంద్రానికి 34 సెంట్ల భూమి విరాళం
మారేడుమాక(కంకిపాడు), కంకిపాడు గ్రామీణం, న్యూస్టుడే
నూతనంగా నిర్మించిన విద్యుత్తు ఉప కేంద్రం
పుట్టి పెరిగిన ఊరిపై ఆయన చూపిన మమకారం ఆ పల్లెకు వెలునిచ్చింది. ఒకప్పుడు వీధి దీపం వెలుగులో చదివి, డొంక రహదారిపై ఐదు కిలోమీటర్ల నడక సాగించి తండ్రి సూచన మేరకు కష్టపడి చదువుకుని ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన కన్నతల్లి వంటి సొంతూరికి మేలు చేశారు. నా కుటుంబం బాగుంది..ఎవరెలా ఉంటే నాకేంటి? అని కాకుండా గ్రామంలో విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి పాటుపడి ఆదర్శంగా నిలిచారు. ఆయనే కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో మారుమూల మారేడుమాక గ్రామానికి చెందిన సూరపనేని రామబ్రహ్మం.
ఆలోచన వచ్చిందిలా..
గత 45 ఏళ్లుగా విజయవాడలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన రామబ్రహ్మం.. గ్రామాభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముందువరుసలో ఉంటారు. తన చిన్నతనంలో గ్రామానికి విద్యుత్తు, రహదారుల సౌకర్యం లేదు. చీకట్లోనే చదువుకొని బురద రహదారిలో నడక సాగించేవారు. ఈ దుస్థితే ఆయనను కలిచి వేసింది. అవకాశం వచ్చినప్పుడు గ్రామానికి ఎలాగైనా మేలు చేయాలని భావించారు. కొందరు గ్రామస్థులు కూడా విద్యుత్తు ఉపకేంద్రం కావాలని కోరారు. దీంతో తనకు పరిచయమున్న ట్రాన్సుకో ఉన్నతాధికారులతో తన ఆలోచనను పంచుకున్నారు. అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పిస్తామని తన గ్రామానికే కేటాయించాలని కోరారు. ఈ మేరకు తనతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారంతో సుమారు రూ.24 లక్షలు విలువైన 34 సెంట్ల స్థలం విరాళంగా ఇవ్వడమే కాకుండా సుమారు రూ.6 లక్షలతో మెరకు చేయించి పరికరాల అమర్పు, కార్యాలయ భవనం నిర్మాణానికి అనుకూలంగా తయారు చేశారు. దీంతో ప్రభుత్వం రూ.6.6 కోట్ల వ్యయంతో ఉపకేంద్రం నిర్మాణం పూర్తి చేసింది. దీనిని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇటీవలే ప్రారంభించారు.
కుటుంబ సభ్యులతో దాత రామబ్రహ్మం
చిన్నతనంలో చీకట్లో చదుకున్నాం..
చిన్నతనంలో తామంతా చీకట్లో చదువుకుని మట్టిదారుల్లో కాలువలు దాటుకుని వెళ్లే పరిస్థితి ఉండేది. గ్రామంలో ఎటువంటి ఉపాధి ఉండేది కాదు. బాగా చదువుకుని గ్రామానికి ఉపయోగపడాలనే తల్లిదండ్రుల చెప్పే మాటలకు కుటుంబ సభ్యులంతా స్ఫూర్తి పొంది విద్యుత్తు ఉపకేంద్రానికి స్థలం విరాళంగా వచ్చాం. ఇందుకు గ్రామస్థులు సహకారం అందించారు. ఉపకేంద్రం నిర్మాణంతో పలువురికి ఉద్యోగాలు రావడంతో పాటు ఈప్రాంతంలో చిన్నతరహా పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది.
డాక్టర్ రామబ్రహ్మం
సేవలు స్ఫూర్తిదాయకం
- బోడే ప్రసాద్, ఎమ్మెల్యే
గ్రామాభివృద్ధిలో డాక్టర్ రామబ్రహ్మంతో పాటు నాగేశ్వరరావు, గంగాధరరావు, పూర్ణచంద్రరావు, మురళీ తదితరులు కృషి చేశారు. నియోజకవర్గంలో ఇంకా ఆరు ఉపకేంద్రాల నిర్మాణం సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేస్తా. తద్వారా నాణ్యమైన విద్యుత్తు నిరంతరం సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది.
11 గ్రామాలకు మేలు
-మురళీమోహన్, ఎస్ఈ, ట్రాన్సుకో
మారేడుమాకలో 33/11 ఉపకేంద్రం నిర్మాణం ద్వారా 11 గ్రామాల్లోని 3,197 మంది గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిర్మాణం వెనుక డాక్టర్ రామబ్రహ్మం కృషి ఎంతైనా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు: దేవినేని ఉమా
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
భార్యను చూసేందుకని.. బస్సునే అపహరించాడు
-
భారాస ప్రగతి కాళేశ్వరంలో కనిపిస్తోంది: జీవన్రెడ్డి ఎద్దేవా
-
సాఫ్ట్వేర్ హుషార్.. రిక్రియేషన్ క్లబ్లు, క్రీడా వసతులు కల్పిస్తున్న సంస్థలు
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
-
న్యాయవిద్యార్థి ‘మత్తు’లీలలు.. కృష్ణకిషోర్ రెడ్డి బాధితులు మరికొందరు?