హత్య చేయించింది భార్యే
ఇటీవల స్థానికంగా కలకలం రేకెత్తించిన బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందులో సూత్రధారి అతడి భార్యే అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.
ప్రియుడితో కలిసి పథక రచన
నలుగురు నిందితుల అరెస్టు
వీడిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: ఇటీవల స్థానికంగా కలకలం రేకెత్తించిన బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందులో సూత్రధారి అతడి భార్యే అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే భర్త తన అక్రమ సంబంధానికి అడ్డు పడతాడన్న కారణంతో ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని ఆమే హత్య చేయించినట్టు తేలింది. ఈ కేసులో ఓ మైనర్తో పాటు మరో నలుగురు నిందితులను గుర్తించి వారిలో నలుగుర్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిందితులను చూపించిన ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు.. ఈ సంఘటన వివరాలు వెల్లడించారు.
బంటుమిల్లి మండలం జానకిరామపురం గ్రామానికి చెందిన చిగురుశెట్టి సుభాష్చంద్రబోస్(42), శిరీష భార్యా భర్తలు కాగా.. భర్త ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో భర్త వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఆమె ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటూ కొంత కాలంగా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేయాలని సుభాష్ చంద్రబోస్ భావిస్తున్న నేపథ్యంలో.. అదే జరిగితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన శిరీష భర్తను అంతమొందించేందుకు ప్రియుడు పరుశురామయ్యతో పథకం పన్నింది. హత్యకు మరికొందరి సహకారంతో ప్రణాళిక రూపొందించుకున్న పరశురామయ్య.. ఈ నెల 5న ఉల్లిపాయలు కావాలంటూ ఓ బాలుడితో సుభాష్ చంద్రబోస్కు ఫోన్ చేయించాడు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో ఉల్లిపాయల మూటలు వేసుకుని నారాయణపురం శ్మశానవాటిక పరిసరాలకు వచ్చిన బోస్పై అక్కడే పొంచి ఉన్న పరశురామయ్యతో పాటు నిడమర్రు మండలం భువనపల్లికి చెందిన కెల్లా హేమంత్కుమార్, భీమవరానికి చెందిన కోడిగుడ్లు మౌళిలు ఐరన్ పైపు, గాలి పంపుతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు : హత్య కేసు మిస్టరీని త్వరగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న పెడన సీఐ నాగేంద్రప్రసాద్, బంటుమిల్లి ఎస్సై వాసు, గూడూరు ఎస్సై వీర్రాజు, ఇతర సిబ్బందిని అభినందించిన ఎస్పీ నగదు రివార్డుల ప్రకటించగా వాటిని ఏఎస్పీ ప్రదానం చేశారు.
మలుపు తిప్పిన సైకిల్ గాలిపంపు
రహదారి ప్రమాదం వల్ల సుభాష్ చంద్రబోస్ గాయపడినట్టు తొలుత భావించినా సంఘటనా ప్రదేశంలో రక్తపు మరకలతో ఉన్న గాలిపంపు ఉండడంతో హత్యాయత్నం జరిగినట్టు తేలింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం, మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తునకు ఎస్పీ నయీమ్అస్మి ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో గ్రామస్థులతో పాటు ఆమె కుటుంబానికే చెందిన కీలక వ్యక్తులు శిరీష నడవడిక గురించి చెప్పిన విషయాల ఆధారంగా వివరాలు సేకరించడంతో ఆమే సూత్రధారి అన్న విషయం వెలుగుచూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
‘పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు’
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
-
కుంతీ కుమారి.. ఓ కార్పొరేట్ ఆసుపత్రి.. గర్భస్థ శిశువు అవశేషాల కోసం వెతుకులాట
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/07/24)
-
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణకు జిష్ణు దేవ్ వర్మ