బైపాస్లో హెచ్టీ విద్యుత్తు లైన్ల మార్పిడి
గొల్లపూడి-చినఅవుటపల్లి బైపాస్ రోడ్డు ఏర్పాటు నేపథ్యంలో హైటెన్షన్ విద్యుత్తు లైన్ల మార్పిడి పనులు చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయబద్ధమైన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
న్యాయబద్ధ పరిహారానికి రైతుల డిమాండ్
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే
పొలాల్లో విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు
గొల్లపూడి-చినఅవుటపల్లి బైపాస్ రోడ్డు ఏర్పాటు నేపథ్యంలో హైటెన్షన్ విద్యుత్తు లైన్ల మార్పిడి పనులు చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయబద్ధమైన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. టవర్ల నిర్మాణాలకు ప్రస్తుత ప్రభుత్వ ధర కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు తీగలు ఉన్న కారిడార్ ప్రాంతానికి 10 శాతం మాత్రమే ఇస్తామంటున్నారు. విజయవాడకు తమ గ్రామాలు అత్యంత సమీపంగా ఉండడం, ఇది రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ భూములు చాలా విలువైనవని రైతులు పేర్కొంటున్నారు. టవర్లు ఏర్పాటు చేసే భూమితో పాటు, తీగలు వెళ్లే కారిడార్కు కూడా 5 రెట్లు (500 శాతం హెచ్చు) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ తరుణంలో 132 కేవీ విద్యుత్తు లైన్ల మార్పిడికి, వీరులపాడు, చందర్లపాడు, నందిగామ ప్రాంతంలో హెచ్టీ లైన్లకు 5 రెట్ల ధరను చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జక్కంపూడిలో 57 మంది, గొల్లపూడిలో 30 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ ఇలా వివిధ కేటగిరీల్లో విద్యుత్తు లైన్లను గొల్లపూడి, జక్కంపూడి ప్రాంతాల్లో వేస్తున్నారు.
కలెక్టర్కు మైలవరం ఎమ్మెల్యే లేఖ
ఈ విషయమై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధిత రైతుల తరఫున కలెక్టర్ జి.సృజనకు ఒక లేఖ రాశారు. రైతుల డిమాండ్ల ప్రకారం 5 రెట్ల మేర చెల్లింపులు చేయాలని కోరారు.
సర్వీసు రోడ్లకు వినతి
బైపాస్ రోడ్డును నిర్మిస్తున్న క్రమంలో సర్వీసు రోడ్లు వేయాలని రైతులు కోరుతున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో రాకపోకలకు వీలుగా సర్వీసు రోడ్లు ఎంతో అవసరమని గొల్లపూడి, జక్కంపూడి రైతులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
‘పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు’
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
-
ఇంటి ముంగిటకే.. అమెరికా డాక్టరు!
-
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
-
కుంతీ కుమారి.. ఓ కార్పొరేట్ ఆసుపత్రి.. గర్భస్థ శిశువు అవశేషాల కోసం వెతుకులాట
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/07/24)
-
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణకు జిష్ణు దేవ్ వర్మ