అడ్డగోలు ప్రతిపాదనలకు ఇక అడ్డుకట్టేనా?
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని అధికార పక్షం ఇప్పటివరకు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తూ వచ్చింది. అడ్డగోలు ప్రతిపాదనలు ఆమోదించుకుంటూ పోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా, సీపీఎం కార్పొరేటర్లను సభను నుంచి సస్పెండ్ చేసి బయటకు గెంటేసింది.
ఎక్స్అఫీషియో సభ్యులుగా తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు
కౌన్సిల్ సమావేశం నేడు
న్యూస్టుడే, విజయవాడ నగరపాలక సంస్థ
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని అధికార పక్షం ఇప్పటివరకు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తూ వచ్చింది. అడ్డగోలు ప్రతిపాదనలు ఆమోదించుకుంటూ పోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా, సీపీఎం కార్పొరేటర్లను సభను నుంచి సస్పెండ్ చేసి బయటకు గెంటేసింది. విపక్షాల ప్రతిపాదనలు తిరస్కరిస్తూ అన్నింటా తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించింది. కౌన్సిల్ సమావేశాలు వైకాపా శాసనసభ్యుల కనుసన్నల్లోనే జరిగేవి.
ప్రస్తుతం పరిస్థితి మారింది. వైకాపా పాలన స్థానే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఎన్డీయే ఎమ్మెల్యేలు కౌన్సిల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ పరిణామం పాలకవర్గానికి మింగుడు పడడం లేదు. ఏకపక్ష నిర్ణయాలకు వీలుపడదన్న భావన పాలకుల్లో నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాను కాదని ప్రతిపాదనలు, తీర్మానాలు ఆమోదించి అధికారులకు పంపినా, ప్రభుత్వానికి చేరినా వాటిని అమలు చేసే విషయంలో అడ్డంకులు తప్పవు. దీంతో ఇకపై ఎలా ముందుకు సాగాలన్న సమాలోచనలతో పాలకవర్గం మల్లగుల్లాలు పడుతోంది.
చాన్నాళ్ల తర్వాత..
ఎన్నికల కోడ్ అనంతరం 5 నెలల 10 రోజులకు మొదటి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో కౌన్సిల్లో ప్రస్తుతం వైకాపా ఎక్స్ అఫీషియో సభ్యుల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వైకాపాకు అనుకూలమైన ప్రతిపాదనలకు ఇక చెల్లుచీటీ పడనుంది. పాలకులు సాహసించి కౌన్సిల్ ముందుకు తెచ్చే ప్రజావ్యతిరేక ప్రతిపాదనలను కార్పొరేషన్, ప్రభుత్వ స్థాయిలో అడ్డుకునేందుకు విపక్షాలకు అవకాశం దొరికింది. దీంతో ఇక నుంచి కౌన్సిల్లో వారిదే పైచేయి కానుందన్న వాదన ఉంది. ఫలితంగా బుధవారం జరగనున్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ముందుకు ప్రజాసమస్యలు, ప్రత్యేక కమిటీల ప్రతిపాదనలు, సాధారణ ప్రతిపాదనలే ఎక్కవగా ప్రవేశపెడుతున్నారు.
తీర్మానాలపై ఉత్కంఠ..
విపక్షాల ప్రతిపాదిత అంశాలపై పాలకవర్గం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ తరహా తీర్మానాలు ఆమోదిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చెత్తపన్ను(యూజర్ ఛార్జీల) రద్దు ప్రతిపాదన, గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విలువ ఆధారిత ఆస్తిపన్ను ఉపసంహరణ, కార్పొరేటర్ల వార్డు బడ్జెట్ పెంపు, రక్షితనీటి సరఫరా, టిడ్కో ఇళ్ల కేటాయింపు, డయేరియా, అతిసారంతో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, విద్యాధరపురం వైకాపా కార్యాలయానికి కేటాయించిన స్థలం స్వాధీనం, అక్కడి నిర్మాణం ప్రజా ప్రయోజనాలకు వినియోగం వంటి ప్రతిపాదనలు, ఆప్కాస్ కార్మికుల వేతనాల పెంపు, ఆస్తి పన్ను విధింపులో లోపాల సవరణ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై పాలకపక్షం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తేలనుంది.
కమిషనర్ ప్రతిపాదనలు..
- గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్పట్లో జరిగిన ఏపీ ఫైబర్నెట్కు సంబంధించిన అంశాలపై చర్చ, సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం కౌన్సిల్ ముందుకు తెస్తున్నారు. నగరంలో 37 జంక్షన్లు ఉండగా, 16 జంక్షన్లలో రూ.2.97 కోట్ల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, 21 జంక్షన్లలో నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు టెండర్ల ఆమోదంతో పాటు, ఆ పనిని హైదరాబాద్ సంస్థకు అప్పగించారు. సంబంధిత ప్రతిపాదనకు మేయర్ ముందస్తు అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం కౌన్సిల్ ముందుకు ర్యాటిఫై కోసం పెడుతున్నారు.
- 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.62 కోట్లతో నీటి సరఫరా, పారిశుద్ధ్య ప్రతిపాదనలకు మేయర్ ముందస్తు అనుమతి ఇవ్వగా, ఇప్పుడు ర్యాటిపై కోసం కౌన్సిల్ ముందుకు తెస్తున్నారు.
- ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రతిపాదనలు సైతం అధికారుల ద్వారా కౌన్సిల్ ముందుకు తెస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని వేదన..
[ 28-07-2024]
వివిధ కారణాలతో ఇంటి నుంచి కనిపించకుండా పోతున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటిలో ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. ఈ సంఖ్య ఏటేటా ఎగబాకుతోంది. కనిపించకుండా పోయిన వారిలో మహిళలతోపాటు పురుషులూ ఉంటున్నారు. -
తీరు మార్చుకోకుంటే... తిప్పలు తప్పవు
[ 28-07-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో గతి తప్పిన వ్యవస్థలు, జాడలేని అభివృద్ధి, సంక్షేమాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేద్దాం.. ఇంకా తీరు మార్చుకోని అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
గుండేరు పొంగింది.. గండమై నిలిచింది
[ 28-07-2024]
ఘంటసాల-చిట్టూర్పు పంచాయతీ జోడుగూడెం సమీపంలో గుండేరు పక్కన కొత్తగా నిర్మించిన బీటీ రహదారి భారీగా కుంగింది. -
‘అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు’
[ 28-07-2024]
‘సీఎం చంద్రబాబు చేస్తున్న పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. -
డొక్కు బస్సు.. జనం బిక్కుబిక్కు..!
[ 28-07-2024]
ఏలూరు రోడ్డు రామవరప్పాడు సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు మరమ్మతులకు గురై ఆగిపోయింది. -
మచిలీపట్నం నుంచి రైళ్లను పునరుద్ధరించాలి
[ 28-07-2024]
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి గతంలో ఉన్న రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి దిల్లీలో కలిసి శనివారం విజ్ఞప్తి చేశారు. -
ప్రభుత్వం మారితే మాకేంటి?
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఐదేళ్లూ అడ్డూ అదుపు లేకుండా ఇసుక దందా కొనసాగించి రూ.కోట్లు దండుకున్న ఆ పార్టీ నాయకులు.. సర్కారు మారినా తమ పంథా వీడలేదు. అధికారంలో ఎవరుంటే మాకేంటి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. -
బాధ్యతగా ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం
[ 28-07-2024]
‘బాధ్యతగా ఉందాం...ప్రజల కోసం పనిచేద్దాం’ అని జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారులకు సూచించారు. -
ప్రారంభించారు..ప్రాణాలు పోగొడుతున్నారు
[ 28-07-2024]
ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. -
సమష్టి కృషితో సమగ్రాభివృద్ధి : కొల్లు
[ 28-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. -
‘పోలవరంపై మాట్లాడే హక్కు జగన్కు లేదు’
[ 28-07-2024]
వైకాపా అధినేత జగన్ అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉంటూ నీలి మీడియాకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
ఆకలితో అలమటిస్తున్నా.. చనిపోయేలా ఉన్నా...
[ 28-07-2024]
‘పాస్పోర్టు లాక్కుని బయటకు తోసేశారు. జీతం అడుగుతుంటే కొడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో.. కార్ల నీడలో కాలం గడుపుతున్నారు. నీళ్లు తాగి బతుకుతున్నా. ఆకలితో చనిపోయేలా ఉన్నా... కాపాడండి. -
హత్య కేసు సీబీసీఐడీకీ అప్పగింతపై హర్షం
[ 28-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు విచారణ బాధ్యతలు సీబీసీఐడీకీ ప్రభుత్వం అప్పగించడంపై అవనిగడ్డలో కూటమి నాయకులు, కోడూరు శివారు ఇస్మాయిల్బేగ్పేటలో డాక్టర్ శ్రీహరిరావు కుటుంబ సభ్యులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి
[ 28-07-2024]
గుడ్లవల్లేరుకు చెందిన బాలింత గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల జుత్తు కత్తిరించిన ఉపాధ్యాయురాలు.. సస్పెండ్ చేసిన డీఈవో
-
కుంతీ కుమారి.. ఓ కార్పొరేట్ ఆసుపత్రి.. గర్భస్థ శిశువు అవశేషాల కోసం వెతుకులాట
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/07/24)
-
పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణకు జిష్ణు దేవ్ వర్మ
-
స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
అందానికి చీర కడితే మౌనీ.. అనుపమ కవ్విస్తూ చూడనీ..