వ్యాపారి దారుణ హత్య
బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు
గుర్తుతెలియని వ్యక్తులు సైకిల్ పంపుతో దాడి
బంటుమిల్లి మండలం నారాయణపురంలో కలకలం
సుభాష్ చంద్రబోస్ (పాత చిత్రం)
బంటుమిల్లి, పెడన, న్యూస్టుడే: బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తమ షాపు నుంచి ట్రక్ ఆటోలో నారాయణపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మచిలీపట్నం డీఎస్పీ సుభాని, రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బంటుమిల్లి మండలం ములపర్రుకు చెందిన చంద్రబోస్ జానకిరామపురంలోని రెండు గుళ్ల సెంటర్లో వర్తక రీత్యా ఐదేళ్ల కిందట స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థితిమంతుడైన చంద్రబోస్కు భార్య శిరీష, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి నారాయణపురంలో ఉల్లిపాయల బస్తాలను డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్న చంద్రబోస్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. 216 జాతీయ రహదారికి కి.మీ. లోపలికి నారాయణపురం రోడ్డులో ఆటో వెళ్లిన తర్వాత సైకిల్కు గాలికొట్టే పంపుతో అతడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను పక్కనే ఉన్న పంట బోదెలోకి తోసేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రికి తరలింపు : తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రబోస్ను స్థానికులు గుర్తించి 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతి చెందారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా, పోస్ట్మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు : ఈ హత్య కేసు ఛేదించే క్రమంలో పెడన సర్కిల్ పరిధిలోని నలుగురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హత్యకు గురైన సుభాష్ చంద్రబోస్తో పాటు కుటుంబ సభ్యుల సెల్ఫోన్ కాల్ డేటా ఇప్పటికే సేకరించారు. క్లూస్టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న గాలిపంపు.. ఘటనా స్థలంలో ఉండడంతో దానిపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చి దర్యాప్తు చేపట్టగా అది జాతీయ రహదారి వైపు వెళ్లి ఆగింది. దీని ఆధారంగా నిందితులు జాతీయ రహదారిపై నుంచి పరారై ఉంటారని భావిస్తున్నారు.
హత్యపై అనుమానాలు: చంద్రబోస్కు వ్యక్తిగత కక్షలు లేవని, అలాగే ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు కూడా లేవని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్గా మారింది. ఓ వ్యక్తిని అనుమానించి పొరుగు జిల్లాలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. హత్యలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తికి, చంద్రబోస్ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ నిందితుడు ఈ హత్యకు ఎందుకు పథకం రచించాడు? తదితర వివరాలు లోతుగా దర్యాప్తు చేస్తేకానీ వెల్లడయ్యే పరిస్థితి లేదు. ఈ సంఘటనపై మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూంఫట్!
[ 17-07-2024]
రెవెన్యూ దస్త్రాల ప్రకారం ఆ భూములు చాలా స్పష్టంగా శ్రీకనకదుర్గ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవిగా ఉన్నాయి. ఆర్ఎస్ఆర్లో ఇనాం భూములుగా నమోదయ్యాయి. -
కళ్లు తెరవకుంటే.. కార్మికులే సమిధలు
[ 17-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ఇలాంటి చిన్న, పెద్ద ప్రమాదాలు జరిగి కార్మికులు బాధితులుగా మారుతున్నారు. -
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
[ 17-07-2024]
ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
కొడాలి నాని కబ్జాలపై ఫిర్యాదు చేయండి
[ 17-07-2024]
‘గుడివాడ నియోజకవర్గంలో చాలా మంది ఆస్తులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అతని అనుచరులు కబ్జా చేశారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, విజయవాడకు చెందిన మరో ఇద్దరి ఆస్తులను సైతం కబ్జా చేయగా హక్కుదారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారని’ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. -
సర్వేలో శ్రీకృష్ణ లీలలు!
[ 17-07-2024]
పెడన కేంద్రంగా సర్వే భూరికార్డుల శాఖ అక్రమ దందా కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. ముడుపులు చెల్లిస్తే చాలు బోగస్ సర్టిఫికెట్ల జారీ జరిగిపోతోంది. -
తిరునల్వేలి- షాలిమార్ ప్రత్యేక రైలు
[ 17-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం తిరునల్వేలి- షాలిమార్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
లెక్కలు తేలనున్నాయి!
[ 17-07-2024]
విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఉమ్మడి కృష్ణాలో జరిగిన తవ్వకాలపై విచారణ చేపట్టింది. దీని కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
భద్రతకు భరోసా ఏది?
[ 17-07-2024]
జిల్లా కేంద్రంలో సర్వజనాసుపత్రి ఉందని, ఇక్కడ స్పెషాలిటీ వైద్యం అందుతుందని అందరూ ఆశించారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇంకెంతకాలం ఈ నిరీక్షణ..!
[ 17-07-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండు సంవత్సరాలకు పైబడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కీలక అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బదిలీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సీఐలు, ఎస్సైలు ఈ జాబితాలో ఉన్నారు. -
గంజాయి మత్తులో దారుణం
[ 17-07-2024]
గంజాయి, మద్యం మత్తులో భార్య, కూతురిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్తపేట అప్పలస్వామి వీధిలో రాంపిళ్ల బాబీ(26) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాకు గుడ్న్యూస్.. త్వరలోనే మహ్మద్ షమి రీ ఎంట్రీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రభాస్కు ఇది రొటీన్.. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది: అమితాబ్ బచ్చన్
-
భార్యాపిల్లల ఎదుటే మాజీ క్రికెటర్ దారుణ హత్య
-
ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు
-
మీ పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా..?: ప్రశ్నించిన మోదీ