ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆజాద్ హుస్సేన్లస్కర్
పెనమలూరు, న్యూస్టుడే: ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... ఆజాద్ హుస్సేన్ లస్కర్ (23) అసోం రాష్ట్రం ననత్బస్తి పట్టణం సమీపంలోని కస్సార్ గ్రామ నివాసి. ఇతని కుటుంబం మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం కానూరు మురళీనగర్ వచ్చి స్థిరపడ్డారు. హుస్సేన్ లస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి ఇతను తన స్వగ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఇటీవల మందలించారు.అప్పటి నుంచి ఇతను మానసికంగా బాధపడుతూ ఎవరితోనూ మాట్లాడడం లేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లస్కర్ తాడుతో ఉరేసుకొన్నాడు. కొంతసేపటికి ఇంటి యజమాని కుమార్తె గుర్తించి యువకుడి తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో వచ్చి పరిశీలించగా అప్పటికే కుమారుడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఘటనపై తండ్రి ఫిర్యాదు చేయగా పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడిలో గాయపడి.. మహిళ మృతి
సరిహద్దు విషయమై బంధువుల మధ్య వివాదం
మృతి చెందిన పరసాదేవి
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: సరిహద్దు వివాదంలో జరిగిన దాడిలో గాయపడి గుడివాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ శుక్రవారం మృతి చెందింది. సేకరించిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామానికి చెందిన పరసా బాలాజీ ఇంటి సరిహద్దులో అతని సోదరుడు తుమ్మా సురేష్ నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సరిహద్దులోని డ్రెయినేజీ విషయమై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఈనెల 3న జరిగిన ఘర్షణలో బాలాజీ భార్య పరసాదేవి(34)పై సురేష్ దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా బాగో లేదని చెప్పడంతో తిరిగి గుడివాడ తీసుకొచ్చి ఏలూరు రోడ్డులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. ఈమేరకు ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాగాలపై డేగలు..!
[ 10-07-2024]
పేదలకు సెంటు భూమి ఇస్తామని ప్రైవేటు భూములను కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఆలస్యమనే వంకతో రెవెన్యూ అధికారుల కమిటీ ధర నిర్ణయించి రైతులకు నచ్చితే విక్రయించాలని అన్నారు. ఇలా వైకాపా నాయకులు ఇష్టారీతిన రేట్లు పెంచి రూ.కోట్లలో జనం సొమ్ము కాజేశారు. -
ఇది కాదా... ‘అచ్చు’త్సాహం!
[ 10-07-2024]
పుస్తకాలేమీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నవి కాదు.. తన సొంత డబ్బులతో కొనే పుస్తకాలపై వైకాపా రంగులను పోలి ఉండేలా.. లోపల సీఎం జగన్మోహన్రెడ్డి అని ఆయన ఫొటోతో తెలుగు సంస్కృత అకాడమీ ముద్రించింది. -
సేత్తారా.. మేత్తారా...!?
[ 10-07-2024]
ఏనుగులపాడు డ్రెయిన్లో తూటికాడ తొలగింపు పనుల అంచనా వ్యయం రూ.20 లక్షలు. ఒక గుత్తేదారు 36 శాతం తక్కువకే టెండర్ వేశారు. మరో గుత్తేదారు 38 శాతం తక్కువకు టెండర్ వేశారు. కానీ ముందస్తుగా పనులు చేసిన గుత్తేదారు మాత్రం 0.1 శాతం తక్కువకు టెండర్ వేశారు. -
హద్దు మీరొద్దు.. ఆపద తేవొద్దు!
[ 10-07-2024]
విజయవాడ నగరానికి వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం నిత్యం వచ్చే వారంతా రామవరప్పాడు రైల్వేస్టేషన్లో రైలు దిగి వస్తుంటారు. నిత్యం వందల మంది ఉదయం, సాయంత్రం సమయాల్లో రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. -
గంజాయిపై ఉక్కుపాదం
[ 10-07-2024]
పెరుగుతున్న గంజాయి వినియోగం, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసు కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. -
మనసంతా సేవ.. ఊరంతా వెలుగు..
[ 10-07-2024]
పుట్టి పెరిగిన ఊరిపై ఆయన చూపిన మమకారం ఆ పల్లెకు వెలునిచ్చింది. ఒకప్పుడు వీధి దీపం వెలుగులో చదివి, డొంక రహదారిపై ఐదు కిలోమీటర్ల నడక సాగించి తండ్రి సూచన మేరకు కష్టపడి చదువుకుని ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన కన్నతల్లి వంటి సొంతూరికి మేలు చేశారు. -
హత్య చేయించింది భార్యే
[ 10-07-2024]
ఇటీవల స్థానికంగా కలకలం రేకెత్తించిన బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందులో సూత్రధారి అతడి భార్యే అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. -
విషమంగానే అయిదుగురి ఆరోగ్యం
[ 10-07-2024]
జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ కర్మాగారం బాయిలర్ పేలిన దుర్ఘటన బాధితుల్లో అయిదుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డీఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. -
బైపాస్లో హెచ్టీ విద్యుత్తు లైన్ల మార్పిడి
[ 10-07-2024]
గొల్లపూడి-చినఅవుటపల్లి బైపాస్ రోడ్డు ఏర్పాటు నేపథ్యంలో హైటెన్షన్ విద్యుత్తు లైన్ల మార్పిడి పనులు చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయబద్ధమైన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. -
అడ్డగోలు ప్రతిపాదనలకు ఇక అడ్డుకట్టేనా?
[ 10-07-2024]
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని అధికార పక్షం ఇప్పటివరకు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తూ వచ్చింది. అడ్డగోలు ప్రతిపాదనలు ఆమోదించుకుంటూ పోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా, సీపీఎం కార్పొరేటర్లను సభను నుంచి సస్పెండ్ చేసి బయటకు గెంటేసింది. -
ఎన్టీటీపీఎస్లో ప్రమాదంపై కేసు
[ 10-07-2024]
ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ఐదో దశ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ బోటం యాష్ పాయింట్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన ప్రమాదంలో గాయపడిన అప్పారావు ఇచ్చిన వాంగ్మూలంతో యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొంటూ ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. -
జగన్మాత సేవలో తెలంగాణ మంత్రులు
[ 10-07-2024]
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, దేవస్థాన అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
తెదేపా సానుభూతిపరులపై దాడి మడిచర్లలో ఉద్రిక్తత
[ 10-07-2024]
బాపులపాడు మండలం మడిచర్లలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కొందరు వైకాపా శ్రేణులు గ్రామంలో హంగామా సృష్టించారు.