నాగేంద్రాయ స్వాహా
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా..
చక్రం తిప్పిన మాజీ మంత్రి జోగి
లజ్జబండ డ్రెయిన్ పనుల్లో అవకతవకలు
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. గడువు పెంచుకుంటూ.. మరో పనిని ఆయనకే అప్పగించడం ఒక్క వైకాపా నాయకులకే సాధ్యం!
ఈనాడు, అమరావతి
ఆ రెండూ ఒకే తరహా పనులు... లజ్జబండ డ్రెయిన్లో పూడిక తీయడం. మొదటి పనికి టెండరు దక్కించుకున్న గుత్తేదారు పదేళ్లపాటు కాలయాపన చేసినా.. రెండో పనిని అదే గుత్తేదారుకు అధిక ధరకు అప్పగించేలా చక్రం తిప్పారు నాటి వైకాపా మంత్రి జోగి రమేష్. అదీ అంచనాలు పెంచి! కాకపోతే సాంకేతికంగా పట్టుబడకుండా ఏజెన్సీ (గుత్త సంస్థ) పేరు మార్చారు. ప్రజాధనం అంటే ఎంత నిర్లక్ష్యమో... ఎలా దోచిపెట్టవచ్చో కృష్ణా జిల్లా డ్రెయినేజీ విభాగంలోని లజ్జబండ డ్రెయిన్ ఆధునికీకరణ, పూడికతీత పనుల వ్యవహారం మరో ఉదాహరణ. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక కృష్ణా డెల్టా ఆధునికీకరణ మొత్తం ఆగిపోయింది. అంతకుముందు పిలిచిన టెండర్లను రద్దు చేశారు. ఒక్క పెడన నియోజకవర్గంలో తప్ప. ఎందుకంటే నాటి మంత్రి జోగి రమేష్ చక్రం తిప్పి ఓ గుత్తేదారుపై అపార ప్రేమ కురిపించడమే!
పెడన నియోజకవర్గంలో లజ్జబండ డ్రెయిన్లో పూడిక తీతకు 2012-13లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) కింద టెండరును రూ. 5.20 కోట్ల అంచనాతో గుత్తేదారు నాగేంద్ర దక్కించుకున్నారు. 0 నుంచి 7వ కిలోమీటరు వరకు పూడిక తీసేందుకు డ్రాయింగ్ డిజైన్లు, ఇతర భూసేకరణ మార్కింగ్ వంటివన్నీ గుత్త సంస్థే చూసుకోవాలి. కానీ.. 2013 నుంచి పట్టించుకోకుండా భూసేకరణ జరగలేదంటూ సాకు చూపిస్తూ వచ్చారు. పూడికతీతకు భూసేకరణ నామమాత్రమే. అయినా అధికారులు గుత్తేదారుకు నోటీసులివ్వకుండా..ఈ పనిని రద్దు చేయకుండా దస్త్రాల్లో మాత్రం ఈవోటీ ఇస్తూ వచ్చారు.
నాటి వైకాపా మంత్రి జోగి రమేష్ 7.5 కిలోమీటరు నుంచి 15వ కిలోమీటరు వరకు పూడిక తీయాలంటూ రూ. 8.98 కోట్లతో జలవనరుల శాఖ ఎస్ఈ ద్వారా ప్రతిపాదించారు. పరిశీలించిన ఈఎన్సీ రూ. కోటి వరకు ఎక్కువ వేసినట్టు గుర్తించారు. ఒత్తిడి తెచ్చిన జోగి.. రూ. 7.98 కోట్లకు మంజూరు చేయించుకున్నారు. వాస్తవానికి అంచనాల్లో తేడాలుంటే తిరిగి రూపొందించాలి. ఇదే సమయంలో పాత ఈపీసీ ప్యాకేజీని కొనసాగిస్తానంటూ పాత గుత్తేదారు నాగేంద్ర లేఖ రాశారు. దీనికి జలవనరుల శాఖ తలూపింది. అంతేకాదు.. కొత్త ప్యాకేజీని కూడా నాన్ ఈపీసీ కింద ఆయనే దక్కించుకున్నారు. ఇక్కడే మతలబు జరిగింది. నాన్ ఈపీసీ కింద టెండర్లో కోట్ చేసిన ధరలకే పనులు చేయాలి. ఈపీసీ టెండర్లో పనులను ప్రస్తుత ధరల ప్రకారం అంచనా వేస్తారు. దీంతో రూ. 5.20 కోట్ల పాత ప్యాకేజీ ధర ఇపుడు దాదాపు రెట్టింపు కానుంది. ఈ డ్రెయిన్ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఈఈ నమోదు చేయకుండా జరుగుతున్నట్టు గత దశాబ్దకాలంగా చూపించడం వెనుక మర్మం ఏమిటో బయటపడాల్సి ఉంది.
- డ్రెడ్జింగ్ నీటిలో చేస్తారు. తీసిన మట్టి ఎంతో లెక్కలు తీయాలి. కానీ.. పాత పనుల పేరుతో ఇవేమీ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
- రెండు పనులను ఒకే గుత్తేదారు చేయడం.. ఈపీసీలో ధరల పెరుగుదల కింద భారీగా లబ్ధి పొందేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కథ నడిపినట్టు తెలుస్తోంది.
- గతేడాది డ్రెయిన్ పనులను సక్రమంగా చేయకపోవడం వల్లనే వరద నీరు వెనక్కి తన్ని పొలాలు నీట మునిగాయి.
ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర ఈ లజ్జబండ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. డ్రెయినేజీ విభాగం అక్రమాలకు నిలయంగా మారిందని సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాల కృష్ణ ఆరోపించారు. అక్రమాలపై మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడుకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చితికిన బతుకులు.. చెదిరిన ఆశలు!
[ 08-07-2024]
‘‘రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవులు... పొద్దంతా శ్రమిస్తేగానీ కడుపు నిండని బతుకులు... వేల కిలోమీటర్ల దూరం వచ్చినా విధి విపత్తులా వెంటాడింది.. విస్ఫోటం రూపంలో కమ్మేసి.. నిలువునా కుప్పకూల్చింది. -
కదిపితే కన్నీరే..
[ 08-07-2024]
కర్మాగారంలో పనిచేస్తున్న సమయంలో వేడి పౌడర్ పడిపోయి 16 మంది గాయపడ్డారు. వీరిలో మన రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు. -
అయినకాడికి ఎదురీదుతూ...
[ 08-07-2024]
రీఫ్ ఆదిలోనే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న నారు మడులకు నీరందించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
గుడివాడలో వైకాపా నాయకుడి అరాచకాలకు తెర
[ 08-07-2024]
గుడివాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని కాలువ గట్టుపై చిరువ్యాపారాలు చేసుకొని బతుకుతున్న నిరుపేదల రక్తాన్ని పదేళ్లుగా అద్దెల రూపంలో పీలుస్తున్న నాని వర్గానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది బీసీ సంఘం. -
కూటమి పాలనలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఉండవు
[ 08-07-2024]
ఉత్తమ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని గనులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జార్జికారనేషన్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిÅగా పాల్గొని ప్రసంగించారు. -
బ్యాంకు అధికారుల దౌర్జన్యంపై నిరసన
[ 08-07-2024]
తక్షణం రుణం చెల్లించాలని టిడ్కో కాలనీ లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడం దారుణమని కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ పేర్కొన్నారు. -
అనిశా ప్రక్షాళన
[ 08-07-2024]
అవినీతి నిరోధకశాఖ(అనిశా) గుంటూరు యూనిట్ పరిధిలో ఒకే రోజు నలుగురు అధికారులను రీప్యాట్రేషన్ చేశారు. దీనిపై అనిశా వర్గాల్లో అలజడి రేగింది. -
వైకాపా సెటిల్మెంట్లకు అడ్డుకట్ట!
[ 08-07-2024]
పెడన మున్సిపల్ కార్యాలయం ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా మారింది. వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ
[ 08-07-2024]
జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. -
ప్రభుత్వ కానుక.. ఉచిత ఇసుక..
[ 08-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. -
పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లొచ్చాయి...!
[ 08-07-2024]
విజయవాడ నగరం అజిత్సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ఉదయం పెట్రోల్తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. -
‘అమ్మ’ సేవలు అభినందనీయం
[ 08-07-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు చేయూతతోపాటు వివిధ రూపాల్లో ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. -
నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం
[ 08-07-2024]
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. బాలుడి దుర్మరణం
[ 08-07-2024]
ఆటో బోల్తా పడి పదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎనికేపాడుకు చెందిన గౌరి లక్ష్మి శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో కలిసి వన్టౌన్ మార్కెట్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. -
ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్కు 617 మంది హాజరు
[ 08-07-2024]
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్లో ఆదివారం 617 మంది హాజరై తమ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించుకున్నారు.