Vijayawada: చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు.
కోర్టులో హాజరుపరిచిన పటమట పోలీసులు
రిమాండ్ను తిరస్కరించిన న్యాయాధికారి
కంటి గాయంతో బాధపడుతున్న గాంధీ (పాతచిత్రం)
న్యూస్టుడే - పటమట: తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. అతడిని రిమాండ్ కోసం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయాధికారి రిమాండ్ను తిరస్కరించారు. తనపై దాడిలో ఈశ్వరప్రసాద్ పాల్గొన్నారని గాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో అప్పట్లో ఏ3గా చేర్చి, ఆ తర్వాత పేరును తొలగించారు. అధికార వైకాపా నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఘటన జరిగిన సమయంలో ఈశ్వరప్రసాద్ లేరని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులను చూపించి ఛార్జిషీట్ను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. ప్రభుత్వం మారడంతో తాజాగా.. ఈ కేసులో కదలిక వచ్చింది. గతంలో నిందితుడిగా చేర్చి తొలగించిన వ్యక్తిని.. తాజాగా అరెస్టు చేశారు. ఈశ్వరప్రసాద్ను ఏ5గా చూపిస్తూ 307 సెక్షన్ చేర్చి ఇన్ఛార్జి కోర్టు అయిన 3వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. గతంలో 326 సెక్షన్ నమోదు చేసి.. ఇప్పుడు ఏ5కు హత్యాయత్నం సెక్షన్ జోడించడం కుదరదని న్యాయాధికారి తిరుమలరావు రిమాండ్ను తిరస్కరించారు. నిందితుడిని వదిలేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
పక్కా ప్రణాళికతోనే దాడి... 2022 సెప్టెంబరు 3న సాయంత్రం 5 గంటల సమయంలో తెదేపా నేత చెన్నుపాటి గాంధీ.. పటమటలంకలోని కొమ్మా సీతారావమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల రోడ్డులో జరుగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు పరిశీలిస్తున్నారు. తాగునీటి లీకేజీ గురించి కార్పొరేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. వైకాపా నేతలు గద్దె కల్యాణ్, సుబ్బు, లీలాప్రసాద్, వల్లూరి ఈశ్వరప్రసాద్లు గాంధీని ఆపి మా ప్రభుత్వంలో నీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు పదునైన ఆయుధంతో గాంధీ కుడికన్నుపై బలంగా పొడవడంతో తీవ్ర గాయమైంది. దీనిపై అప్పట్లో సెక్షన్ 326, 506 కింద కేసు నమోదు చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతల దాడి కేసులో అప్పట్లో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో గాయం నివేదికను సమర్పించక పోవడంతో రిమాండ్ తిరస్కరణకు గురైంది. గద్దె కల్యాణ్, లీలా కృష్ణ ప్రసాద్, సుబ్బులను నిందితులుగా చూపించారు. గాయానికి సంబంధించి నివేదిక పొందుపరచక పోవడంతో సెక్షన్ 326ను పరిగణనలోకి తీసుకోలేమనీ, నిందితులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ అప్పట్లో న్యాయాధికారి రిమాండ్ను తిప్పి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కేశినేని చిన్నిపై దాడి కేసులో నలుగురి అరెస్టు
ఎ.కొండూరు: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితులైన కంభంపాడుకు చెందిన వైకాపా వర్గీయులు కాలసాని చెన్నారావు, చిమటా రామకృష్ణ, చిమటా వెంకటేశ్వర్లు, చిమటా గోపాలరావును అరెస్టు చేసినట్లు ఎస్సై సీహెచ్.కృష్ణ గురువారం తెలిపారు. మరో నిందితుడైన మెంతుల శివకృష్ణ పరారీలో ఉన్నాడన్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కంభంపాడు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రస్తుత ఎన్డీయే కూటమి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆయన అనుచరులపై వైకాపా ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త వైకాపా మండల యువత అధ్యక్షుడైన కాలసాని చెన్నారావు తన అనుచరులతో కలిసి రాళ్లతో దాడి చేశారు. ఎంపీని ఆయన అనుచరులను చంపుతానని బెదిరించి భయానక వాతావరణం సృష్టించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గత నెల 30న ఎ.కొండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు పైన తెలిపిన నలుగురు నిందితులను అరెస్టు చేసి తిరువూరు న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితులపై బీఎన్ఎస్ 143, 147, 341, 352, 506 రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లొచ్చాయి...!
[ 08-07-2024]
విజయవాడ నగరం అజిత్సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ఉదయం పెట్రోల్తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. -
చితికిన బతుకులు.. చెదిరిన ఆశలు!
[ 08-07-2024]
‘‘రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవులు... పొద్దంతా శ్రమిస్తేగానీ కడుపు నిండని బతుకులు... వేల కిలోమీటర్ల దూరం వచ్చినా విధి విపత్తులా వెంటాడింది.. విస్ఫోటం రూపంలో కమ్మేసి.. నిలువునా కుప్పకూల్చింది. -
కదిపితే కన్నీరే..
[ 08-07-2024]
కర్మాగారంలో పనిచేస్తున్న సమయంలో వేడి పౌడర్ పడిపోయి 16 మంది గాయపడ్డారు. వీరిలో మన రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు. -
అయినకాడికి ఎదురీదుతూ...
[ 08-07-2024]
రీఫ్ ఆదిలోనే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న నారు మడులకు నీరందించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
గుడివాడలో వైకాపా నాయకుడి అరాచకాలకు తెర
[ 08-07-2024]
గుడివాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని కాలువ గట్టుపై చిరువ్యాపారాలు చేసుకొని బతుకుతున్న నిరుపేదల రక్తాన్ని పదేళ్లుగా అద్దెల రూపంలో పీలుస్తున్న నాని వర్గానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది బీసీ సంఘం. -
కూటమి పాలనలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఉండవు
[ 08-07-2024]
ఉత్తమ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని గనులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జార్జికారనేషన్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిÅగా పాల్గొని ప్రసంగించారు. -
బ్యాంకు అధికారుల దౌర్జన్యంపై నిరసన
[ 08-07-2024]
తక్షణం రుణం చెల్లించాలని టిడ్కో కాలనీ లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడం దారుణమని కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ పేర్కొన్నారు. -
అనిశా ప్రక్షాళన
[ 08-07-2024]
అవినీతి నిరోధకశాఖ(అనిశా) గుంటూరు యూనిట్ పరిధిలో ఒకే రోజు నలుగురు అధికారులను రీప్యాట్రేషన్ చేశారు. దీనిపై అనిశా వర్గాల్లో అలజడి రేగింది. -
వైకాపా సెటిల్మెంట్లకు అడ్డుకట్ట!
[ 08-07-2024]
పెడన మున్సిపల్ కార్యాలయం ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా మారింది. వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ
[ 08-07-2024]
జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. -
ప్రభుత్వ కానుక.. ఉచిత ఇసుక..
[ 08-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. -
‘అమ్మ’ సేవలు అభినందనీయం
[ 08-07-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు చేయూతతోపాటు వివిధ రూపాల్లో ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. -
నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం
[ 08-07-2024]
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. బాలుడి దుర్మరణం
[ 08-07-2024]
ఆటో బోల్తా పడి పదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎనికేపాడుకు చెందిన గౌరి లక్ష్మి శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో కలిసి వన్టౌన్ మార్కెట్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. -
ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్కు 617 మంది హాజరు
[ 08-07-2024]
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్లో ఆదివారం 617 మంది హాజరై తమ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
-
దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు
-
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?
-
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?