8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు.
జిల్లాలో అందుబాటులో 3,69,588 క్యూబిక్ మీటర్లు
తవ్వకం, లోడింగ్, రవాణా, సీనరేజీలకు నామ మాత్ర ఫీజు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సృజన
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. రేవుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్, రవాణా, సీనరేజీల కింద నామ మాత్ర ఫీజు వసూలు చేస్తారని తెలిపారు. ఇలా వసూలు చేసే సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరదన్నారు. నేరుగా స్థానిక సంస్థలైన జిల్లా మండల, పరిషత్తు, పంచాయతీలకు చేరుతుందని చెప్పారు. ఈ మొత్తాలతో రేవుల అభివృద్ధికి, వాటికి ఉన్న రహదారుల కోసం వినియోగించనున్నట్టు వివరించారు. నగరంలోని కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక రేవులు ఉండగా, 8 రేవుల్లో 3,69,588 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వలు ఉన్నట్టు చెప్పారు. ఇసుక నిల్వలు, ఉచిత అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. ఇసుక కొరత లేకుండా పూడిక రూపంలో ఉన్న పాయింట్లను ముందుగానే గుర్తించాలన్నారు. సమావేశంలో గనుల శాఖ డీడీ జి.వెంకటేశ్వర్లు, డీపీవో ఎన్.వి.శివప్రసాద్ యాదవ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య మిషన్ ఎస్ఈ డి.వి.రమణ, భూగర్భ జల శాఖ డీడీ బి.నాగరాజు, డీటీసీ ఎం.పురేంద్ర, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, ఆయా ప్రాంతాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్ కొట్టిస్తే.. నీళ్లొచ్చాయి...!
[ 08-07-2024]
విజయవాడ నగరం అజిత్సింగ్నగర్ ఆంధ్రప్రభకాలనీలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ఉదయం పెట్రోల్తో పాటు నీళ్లు కూడా రావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. -
చితికిన బతుకులు.. చెదిరిన ఆశలు!
[ 08-07-2024]
‘‘రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవులు... పొద్దంతా శ్రమిస్తేగానీ కడుపు నిండని బతుకులు... వేల కిలోమీటర్ల దూరం వచ్చినా విధి విపత్తులా వెంటాడింది.. విస్ఫోటం రూపంలో కమ్మేసి.. నిలువునా కుప్పకూల్చింది. -
కదిపితే కన్నీరే..
[ 08-07-2024]
కర్మాగారంలో పనిచేస్తున్న సమయంలో వేడి పౌడర్ పడిపోయి 16 మంది గాయపడ్డారు. వీరిలో మన రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్కు చెందిన కార్మికులు ఉన్నారు. -
అయినకాడికి ఎదురీదుతూ...
[ 08-07-2024]
రీఫ్ ఆదిలోనే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండిపోతున్న నారు మడులకు నీరందించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
గుడివాడలో వైకాపా నాయకుడి అరాచకాలకు తెర
[ 08-07-2024]
గుడివాడ వైకాపా మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పట్టణంలోని కాలువ గట్టుపై చిరువ్యాపారాలు చేసుకొని బతుకుతున్న నిరుపేదల రక్తాన్ని పదేళ్లుగా అద్దెల రూపంలో పీలుస్తున్న నాని వర్గానికి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది బీసీ సంఘం. -
కూటమి పాలనలో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఉండవు
[ 08-07-2024]
ఉత్తమ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకమని గనులు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జార్జికారనేషన్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిÅగా పాల్గొని ప్రసంగించారు. -
బ్యాంకు అధికారుల దౌర్జన్యంపై నిరసన
[ 08-07-2024]
తక్షణం రుణం చెల్లించాలని టిడ్కో కాలనీ లబ్ధిదారులపై బ్యాంకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడం దారుణమని కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ పేర్కొన్నారు. -
అనిశా ప్రక్షాళన
[ 08-07-2024]
అవినీతి నిరోధకశాఖ(అనిశా) గుంటూరు యూనిట్ పరిధిలో ఒకే రోజు నలుగురు అధికారులను రీప్యాట్రేషన్ చేశారు. దీనిపై అనిశా వర్గాల్లో అలజడి రేగింది. -
వైకాపా సెటిల్మెంట్లకు అడ్డుకట్ట!
[ 08-07-2024]
పెడన మున్సిపల్ కార్యాలయం ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా మారింది. వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. -
జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ
[ 08-07-2024]
జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. -
ప్రభుత్వ కానుక.. ఉచిత ఇసుక..
[ 08-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం జిల్లాలో ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. -
‘అమ్మ’ సేవలు అభినందనీయం
[ 08-07-2024]
పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు చేయూతతోపాటు వివిధ రూపాల్లో ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. -
నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం
[ 08-07-2024]
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా.. బాలుడి దుర్మరణం
[ 08-07-2024]
ఆటో బోల్తా పడి పదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎనికేపాడుకు చెందిన గౌరి లక్ష్మి శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలతో కలిసి వన్టౌన్ మార్కెట్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. -
ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్కు 617 మంది హాజరు
[ 08-07-2024]
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక కేటగిరీ కౌన్సెలింగ్లో ఆదివారం 617 మంది హాజరై తమ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్