Jogi Ramesh: జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు.
చిరుద్యోగులపై వేటేసి తిమింగలాలను వదిలేశారా?
అధికారులకు తెలియకుండానే సర్వే నంబరు మార్చారా?
నేటికీ తేలని నిజాలు.. కేసు నమోదులో పోలీసుల తాత్సారం
ఈనాడు, అమరావతి
వివాదం లేని భూమిని సర్వే చేయాలంటేనే తహసీల్దారు అనుమతి తప్పనిసరి. అలాంటిది అగ్రిగోల్డ్ భూములుగా సీఐడీ జప్తు చేశాక తహసీల్దారు, ఆర్డీవోకు సమాచారం లేకుండానే సర్వే చేశారా? వారికి తెలియకుండానే సవరణ చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే పైస్థాయిలో ఎవరు ఒత్తిడి తెచ్చారు?
ఈ మొత్తం వ్యవహారంలో తహసీల్దారు మొదలుకుని సంయుక్త కలెక్టరు వరకూ ఎవ్వరూ బాధ్యులు కాదట.. క్షేత్రస్థాయి సంఘటనలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వీఆర్వో కూడా బాధ్యులు కాదట... సవరణ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్పై కూడా చర్యల్లేవు.. ఇదంతా విస్మయం కలిగిస్తోందని తెదేపా శ్రేణులంటున్నాయి. ?
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగంలోని తిమింగలాలను వదిలి కిందిస్థాయి ఉద్యోగులను బలి చేశారన్న వాదన వినబడుతోంది. ఏకంగా సీఐడీ అటాచ్ చేసిన భూమిని.. నిషేధిత జాబితాలో ఉన్నా సరే.. సర్వే నంబరు మార్చేసి కబ్జా చేయడానికి ఉన్నతస్థాయిలోని వ్యక్తుల ప్రమేయం లేకుండా కిందిస్థాయి సిబ్బంది ఎలా సహకరిస్తారన్నది ప్రశ్న. వాస్తవానికి ఈ వ్యవహారం ఆరు నెలల క్రితమే పోలీసుల దృష్టికి వచ్చినా.. నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో దస్త్రాన్ని తొక్కిపెట్టారు. తాజాగా కదలిక వచ్చి దాదాపు 20 రోజులైనా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
పెద్దల పాత్ర లేదా..?
జోగి కుటుంబం కబ్జా వెలుగు చూశాక గ్రామీణ మండల తహసీల్దారు జాహ్నవి ఇచ్చిన నివేదిక ప్రకారం డిప్యూటీ తహసీల్దారు విజయ్కుమార్, మండల సర్వేయరు రమేష్, గ్రామ సర్వేయరు దేదీప్యలను నాటి కలెక్టరు డిల్లీరావు సస్పెండ్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదట్లో మండల సర్వేయరు, గ్రామ సర్వేయరును మాత్రమే బాధ్యులుగా చేస్తూ నివేదిక ఇవ్వగా కలెక్టరు మండిపడి మరోసారి రిపోర్ట్ రప్పించుకున్నారు. తహసీల్దారు, ఆర్డీవో పాత్రపై విచారణ చేయాలని ఆయన సిఫార్సు చేశారు. ఆ మర్నాడే డిల్లీరావు బదిలీ అయ్యారు.
- ఆ భూమిని వివాదాస్పదం చేశారని తహసీల్దారు జాహ్నవి పోలీసులకిచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. 2023 మార్చి 1న సర్వే నంబరు మార్పు కోసం సర్వే చేసిన సమయంలో తహసీల్దారుగా జాహ్నవి ఉన్నారు. ఈమెకు తెలియకుండానే ఎఫ్ లైన్ నివేదిక, భూస్వాధీన ఉత్తర్వులు జారీ అయ్యాయని చెబుతున్నారు. ఇదెలా జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే సబ్ కలెక్టరుగా ఉన్న ఐఏఎస్ అధికారి అదితిసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి వద్దకు కూడా దస్త్రం వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంయుక్త కలెక్టరుకు తెలియజేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారిపై ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సవరణ పేరుతో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారన్నదానిపై ఏ స్థాయిలోనూ ఎవరూ ప్రశ్నించలేదు. ఆ సమయంలో జేసీగా శ్రీనివాస్నుపూర్ అజయ్ ఉన్నారు.
- గ్రామ వీఆర్వో శ్రీనివాస్ పాత్ర లేదని తహసీల్దారు చెబుతున్నారు. కానీ.. సర్వే నంబరు 88లో భూమి లేదని, సర్వే నంబరు 87లో ఉందని నివేదించిన తొలి వ్యక్తి వీఆర్వోనే.
జోగి రమేష్ కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమి ఇదే..
పోలీసుల వ్యూహమేమిటి?
అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారని 2023 జనవరిలోనే విజయవాడ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందినా పక్కన పెట్టేశారు. కానీ.. ఓ ఎస్సై దీన్ని మండల రెవెన్యూ కార్యాలయానికి పంపడంతో తహసీల్దారు విచారణ చేసి 2023 మార్చిలో నివేదిక పంపారు. ఈలోగా ఎన్నికలొచ్చాయి. అప్పటికే జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు. దీంతో వ్యవహారాన్ని అధికారులు వెలుగులోకి తీసుకురాలేదు. ఇటీవల బయటపడ్డప్పుడు రెండో పట్టణ సీఐ గణేష్ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని అబద్ధం చెప్పారు. మీడియాలో ప్రసారమయ్యాక అప్పుడు దస్త్రాలను వెదికారు. తాజా పరిణామాలేమంటే.. సీఐడీ అధికారులు సదరు భూమిని పరిశీలించి వెళ్లారు. అక్కడి నుంచి ఫిర్యాదు అందాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. డీజీపీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు కనబడడం లేదు. జోగి కుటుంబం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసిన వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి బంధువులు మాత్రం కిమ్మనడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.