Vijayawada: వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు.
జమ్మూ నుంచి విజయవాడ చేరుకున్న ప్రత్యేక బృందం
యువతిని తల్లికి అప్పగించిన పోలీసులు
నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - పటమట: జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. గత 9 నెలల నుంచి కనిపించకుండా పోయిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని తేజస్విని, అంజాద్ను విజయవాడ పోలీసులు జమ్మూ నుంచి బుధవారం తెల్లవారుజామున విమానంలో బెజవాడ తీసుకొచ్చారు. అనంతరం మాచవరం పోలీసులు వీరిని తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్మెంట్లను తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబరు 28న అంజాద్ బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పింది. 9 నెలల్లో ఎక్కడా తనను ఇతరులతో ఫోన్లో మాట్లాడనీయలేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి.. చివరకు జమ్మూలో దిగినట్లు స్టేట్మెంట్లో యువతి వివరించింది. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికీ వెళ్లలేకపోయినట్లు చెప్పింది. తాము ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు అంజాద్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. తేజస్విని స్టేట్మెంట్ ఆధారంగా అంజాద్పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా బంధించడం, పెళ్లి చెసుకుంటానని బలవంతాన తీసుకెళ్లడం, దాడి చేయడం, బంధించడం వంటి నేరాలపై బిఎన్ఎస్లోని 342, 366, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టారు. యువతిని పోలీసులు తల్లికి అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
రెండు గంటల్లో జమ్మూ పోలీసుల ఆపరేషన్... గత ఏడాది నవంబరులో హైదరాబాద్, కేరళ, ముంబయి, రాజస్థాన్కి వెళ్లారు. అనంతరం డిసెంబరులో దిల్లీలో జమ్ముతావి రైలెక్కి జమ్మూ స్టేషన్లో దిగారు. అక్కడ ఓ హోటల్కు వెళ్లిన అంజాద్.. ఇద్దరం ప్రేమికులమనీ, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో జమ్మూ వచ్చినట్లు చెప్పాడు. హోటల్లో నెలకు రూ.7,500 పనికి కుదిరాడు. యజమాని వసతి కూడా ఇవ్వడంతో తేజస్వినిని గదిలో ఉంచాడు. జీతం ద్వారా వచ్చిన డబ్బుతో పొదుపు చేసుకుని.. మార్చిలో ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కూడా యువతికి మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అంజాద్ లేని సమయంలో ఫోన్ తీసుకుని సోదరికి ఇన్స్టాలో సందేశం పంపించింది. ఈమె వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. చిరునామాపై స్పష్టత వచ్చే సరికి సాయంత్రం 5 గంటలైంది. వెంటనే జమ్మూ పోలీసులకు వివరాలను విజయవాడ నుంచి పంపించారు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి.. యువతీ, యువకులను తమ అదుపులోకి తీసుకుని జమ్మూలోని గాంధీనగర్ స్టేషన్కు తీసుకొచ్చి.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వీరిద్దరి ఫోటోలను విజయవాడ పోలీసులకు పంపించారు. రెండు గంటల్లో జమ్మూ పోలీసులు ఆపరేషన్ ముగించి తేజస్విని, అంజాద్ను తమ అదుపులోకి తీసుకున్నారు.
నా కుమార్తె దక్కుతుందని అనుకోలేదు
- శివకుమారి, తేజస్విని తల్లి
నాకు నా కుమార్తె దక్కుతుందని అనుకోలేదు. 9 నెలలుగా తేజస్విని ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించగానే నా కుమార్తె దొరికింది. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను. నేను వ్యక్తిగతంగా వెళ్లి పవన్ను కలుస్తా. విజయవాడ పోలీసులు కేసు ఛేదనలో తీవ్రంగా కృషి చేశారు. మాకు ఫోన్ చేయనీయకుండా అంజాద్ అడ్డుకున్నాడు. ప్రస్తుతం డిప్రెషన్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సంస్కరణవాదికే పట్టం.. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్..!
-
కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు
-
రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
ఓపెనర్గా రావాలనుకుంటున్నా.. రోహిత్, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్మన్ గిల్
-
భారాసనే ఫిరాయింపులను ప్రోత్సహించింది: జీహెచ్ఎంసీ మేయర్
-
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు