పుట్టగానే కవల శిశువుల మృతి
పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
ఆపై బాలింత కన్నుమూత
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
మృతి చెందిన కవల శిశువులు, తల్లి మాధవి
పటమట(విజయవాడ), న్యూస్టుడే: పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరుకు చెందిన మాధవి(24) గతంలో వాలంటీర్గా పని చేశారు. మాధవి భర్త ప్రశాంత్ గంగూరు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మాధవి కవల పిల్లల గర్భిణి. ఆమెకు మూడో నెల వచ్చినప్పటి నుంచి పటమటలోని పద్మావతి ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతోంది. ఈ నెల 2వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో నొప్పులు రావడంతో పటమటలోని పద్మావతి ఆసుపత్రిలో చేర్చించారు. 12.30 గంటలకు సాధారణ ప్రసవం జరిగి ఒకరు మగ శిశువు జన్మించి మరణించాడు. రాత్రి ఒంటి గంటకు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయగా రెండో మగ శిశువు కూడా కన్నుమూశాడు. మాధవికి కామెర్లు ఉన్నట్లు గుర్తించారు. అధిక రక్తస్రావం కూడా కావడంతో తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ నక్కల రోడ్డులోని ఆంధ్రా ఆసుపత్రిలో చేర్చించారు. మాధవి అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి బుధవారం ఉదయం 10 గంటలకు మరణించింది. భార్యతో పాటు ఇద్దరు శిశువులు కన్నుమూయడంతో ప్రశాంత్తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ముగ్గురూ మృతి చెందారని పద్మావతి ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. సరైన వైద్యం అందించకపోవడంతో తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటమట పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నివేదిక వచ్చాక చర్యలు
బాలింతతో పాటు ఇద్దరు కవల శిశువుల మృతిపై విచారణ కమిటీ వేశాం. బాలింత చికిత్స పొందిన ఆంధ్రా ఆసుపత్రితో పాటు శిశువులు కన్నుమూసిన పటమటలోని పద్మావతి ఆసుపత్రికి విచారణ కమిటీ వెళ్లి పరిశీలించింది. బాలింతకు ఇచ్చిన మందులు, చేసిన వైద్య పరీక్షల గురించి ఆరా తీసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విచారణ కమిటీ నివేదిక అందజేస్తారు. ఆ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం.
సుహాసిని, జిల్లా వైద్యాధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.