భార్య చేతిలో భర్త హతం
పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది.
బంటుమిల్లి మండలం చినతుమ్మిడిలో ఘటన
అప్పారావు (పాత చిత్రం) నిందితురాలు కీర్తన
బంటుమిల్లి, పెడన, న్యూస్టుడే: పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. పెడన రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. చినతుమ్మిడికి చెందిన గుకిమి అప్పారావు(35), కీర్తనలు భార్యాభర్తలు కాగా.. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ కుటుంబంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య నడవడికపై అనుమానం పెంచుకున్న భర్త అప్పారావు ఆమెను పలుమార్లు మందలిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు పెరిగి తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న అప్పారావు.. భార్యతో మరోసారి వివాదానికి దిగాడు. నీ నడవడికపై అనుమానం ఉందని ప్రశ్నించాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అర్ధరాత్రి సమయంతో ఇరువురు మరోసారి గొడవకు దిగారు. దీంతో కీర్తన తన భర్తపై ఇనుప స్క్రూడ్రైవర్తో తల వెనుక నుంచి దాడి చేసింది. ఈఘటనలో తీవ్రగాయాలైన అప్పారావు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరి అచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కేసు నమోదు చేశారు. అప్పారావు మృతదేహానికి మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై జి.వాసు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.