పథకమేసి.. దోపిడీ చేసి రూ. 80 లక్షల చోరీ
తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు.
కేసు ఛేదన
న్యూస్టుడే, నెల్లూరు: తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. అనుకున్నట్టుగానే.. ముందుగా నియమించుకున్న వ్యక్తులు కారులో వెంబడించారు. మధ్యలో బస్సు హోటల్ దగ్గర ఆగడం.. ఏమీ ఎరగనట్టు బస్సు దిగడం.. ఆ వెంటనే పథకాన్ని పూర్తిగా అమలు చేసి.. మిగిలిన ఉద్యోగి దగ్గరున్న నగదు సంచులను దోచుకెళ్లడం జరిగిపోయాయి.. తర్వాత ఏమీ ఎరగనట్టు సహచురుడితో కలిసి ఫిర్యాదు చేసినా.. పోలీసులు రంగంలోకి దిగడంతో.. డామిట్ కథ అడ్డం తిరిగింది. విషయం బయటపడింది. సంబంధిత వివరాలను ఏఎస్పీ సౌజన్య బుధవారం విలేకరులకు వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
చింతకుంట చెన్నకేశవరెడ్డి స్టోర్ అసిస్టెంట్గా, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చలమంగళం గ్రామానికి చెందిన హరినాథ్రెడ్డి అకౌంట్ అసిస్టెంట్గా చెన్నైలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. వీరు సోమవారం విజయవాడ నుంచి కంపెనీ తాలూకు రూ. 80 లక్షల నగదు తీసుకుని ట్రావెల్స్ బస్సులో చెన్నైకు బయలుదేరారు. కావలి రుద్రకోట సమీపంలో దాబా వద్ద వ్యక్తిగత అవసరాల నిమిత్తం బస్సు ఆగగా.. చెన్నకేశవరెడ్డి కిందకు దిగారు. హరినాథ్రెడ్డి బస్సులోనే ఉన్నారు. వెనుకే కారులో వచ్చిన ఇద్దరు.. బస్సు ఎక్కి, హరినాథ్రెడ్డికి మత్తు మందు ఇచ్చి నగదు సంచులను ఎత్తుకువెళ్లారు. ఇదే విషయాన్ని చెన్నకేశవరెడ్డికి చెప్పగా.. ఇద్దరూ అదే రోజు రాత్రి కావలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డీఎస్పీ ఎం.వి.వెంకటరమణ, సీసీఎస్ డీఎస్పీ పి.రామకృష్ణాచారి నేతృత్వంలో కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాసరావు, రాజేష్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించగా.. నగదు సంచులతో ఇద్దరు బస్సు దిగి కారులో వెళ్లినట్లు గుర్తించారు. వారు విజయవాడ నుంచి బస్సును వెంబడిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఇద్దరు ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. హరినాథరెడ్డి స్నేహితులతో కలిసి నగదు దోపిడీ చేసినట్లు వెల్లడైంది.
అవసరాల కోసం...: అవసరాల కోసం కంపెనీ నగదు కాజేయాలని హరినాథ్రెడ్డి నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని.. స్నేహితులైన అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన వినోద్కుమార్, రమేశ్కు చెప్పి పథక రచన చేశారు. అందుకు కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన యాసిన్బాషా, దివాసన బనవార్ను నియమించుకున్నారు. వీరు కారులో బస్సును వెంబడించి.. నగదు దోచుకెళ్లేలా పథకమేశారు. ఈ నెల ఒకటో తేదీ కంపెనీ స్టోర్ అసిస్టెంట్తో కలిసి.. విజయవాడ నుంచి రూ. 80 లక్షల నగదు ట్రావెల్స్ బస్సులో చెన్నైకు తీసుకువెళుతుండగా.. అమలు చేశారు. వినోద్కుమార్, రమేశ్ బస్సులో ఎక్కగా.. మరో ఇద్దరు కారులో వెంబడించారు. కావలి సమీపంలో దాబా వద్ద నిందితులు నగదు సంచులు తీసుకుని కారులో పరారయ్యారు. బుధవారం మదనపల్లి, బెంగళూరు సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.77.50 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్లు, దుత్తలూరు ఎస్సై ఉమాశంకర్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
-
పేట్రేగిపోతున్న మృగాళ్లు.. వావీ వరుసలు మరిచి దుర్మార్గాలు
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
-
ఒకే ఒక్క నిర్ణయం.. ఆరు జీవితాలకు వరప్రసాదం!
-
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
జాగ్రత్తలు పాటిస్తే జూలీతో జాలీయే..!