వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు
తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు.
విజయవాడకు చెందిన 50 మందికి పైగా పాత్ర
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు
ఈనాడు - అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ కేసుపై పోలీసులు దృష్టి సారించడంతో అరెస్టు భయంతో బెజవాడ నాయకులు ఫోన్ స్విచాఫ్ చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోతున్నారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకదాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కేసును పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు విచారణ వేగవంతం చేశారు. దాదాపు 50 మందికి పైగా నాయకులు, వారి అనుచరుల పాత్ర ఉన్నట్లు తేలింది.
అంతా అవినాశ్ అనుచరులే...
దాడిలో పాల్గొన్న వారు గుణదల, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల వారిగా గుర్తించారు. వీరంతా వైకాపా నాయకుడు దేవినేని అవినాశ్ అనుచరులుగా తేలింది. నిందితుల్లో పలువురు కార్పొరేటర్లు ఉన్నట్లు తెలిసింది. 18వ డివిజన్ కార్పొరేటర్, వైకాపా ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి కుమారుడు రాజా, దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, గాంధీ సహకార బ్యాంకు డైరెక్టర్ జోగరాజు, మాజీ ఉప మేయర్ చల్లారావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి ప్రమేయంపై సాక్ష్యాలు కూడా సేకరించినట్లు తెలిసింది. వీరంతా తమ వాహనాల్లో నగరం నుంచి అనుచరులను తీసుకెళ్లి మరీ దాడి చేయించారు. ఎం.పవన్, సాయి, దుర్గారావు, ఇతని బంధువు శేఖర్, సిరాజ్, జోగ రమణ, పంతల సాయి, చైతన్య అలియాస్ వర, సంతోష్, తదితరులు దాడి చేసిన వారిలో ఉన్నారు. 18, 21, 22 డివిజన్ల నుంచి ఎక్కువ మంది పాల్గొన్నారు.
అజ్ఞాతంలోకి పంపించారు...
దాడి ఘటన నిందితులను అజ్ఞాతంలోకి వెళ్లమని వైకాపా ముఖ్య నాయకుడి నుంచి సూచనలు వెళ్లినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామనీ, ఇబ్బంది లేదని వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు అరెస్టు అయి.. అసలు సూత్రధారుల పేరు చెబితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని కంగారు పడుతున్నారు. త్వరలో అవినాశ్ అనుచరుల అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచి అదృశ్యం.. ఆరు గంటల్లో ప్రత్యక్షం
[ 06-07-2024]
విజయవాడ నగరంలో నలుగురు మైనర్లు ఒకే రోజు అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. ఉదయం ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వీరిలో ఓ బాలిక సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
[ 06-07-2024]
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
అతిసారం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
[ 06-07-2024]
జిల్లాలో అతిసారం ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. -
దాత ఔదార్యం.. చేరువైన వైద్యం
[ 06-07-2024]
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల నేరనుంది. ఇప్పటిదాకా ఇక్కడి పేదలు ఉచిత వైద్యం కోసం పెనమలూరు మండల పీహెచ్సీకి వెళ్లేవారు. -
పులిగడ్డ అక్విడక్ట్ సుందరీకరణకు చర్యలు
[ 06-07-2024]
వైకాపా పాలనలో నిరాదరణకు గురైన పులిగడ్డ అక్విడక్ట్ను సందరీకరించేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రణాళిక సిద్ధం చేశారు. -
గోదారమ్మ వచ్చేసింది!
[ 06-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా జిల్లాకు చేరాయి. -
స్వచ్ఛ పట్టణం లక్ష్యంగా ‘ఐ లవ్ గుడివాడ’ ప్రాజెక్టు
[ 06-07-2024]
గుడివాడను ప్రేమించే వారు, పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలనుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐ లవ్ గుడివాడ ప్రాజక్టును రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. -
ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
[ 06-07-2024]
ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
నకిలీ హాల్మార్క్ బంగారు ఆభరణాల పట్టివేత
[ 06-07-2024]
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) విజయవాడ శాఖ అధికారులు నకిలీ హాల్ మార్కింగ్ చేస్తున్న కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. -
జగ్గయ్యపేటలో విజృంభిస్తున్న అతిసారం కేసులు
[ 06-07-2024]
జగ్గయ్యపేట నియోజకవర్గంలో గడిచిన రెండు రోజుల్లో మళ్లీ స్వల్పంగా అతిసారం కేసులు పెరుగుతుండటంతో డీఎంహెచ్ఓ ఎం.సుహాసిని కారణాలపై విచారణ చేపట్టారు.