ప్రేమ పేరుతో వల
హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యువతులను ట్రాప్ చేయడం అంజాద్ నైజం
పలు ప్రాంతాలు తిరిగి.. డబ్బుల్లేక అష్టకష్టాలు
తేజస్విని ఆచూకీ లభ్యంతో ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - పటమట : గత తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో సీనియర్ అయిన అంజాద్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. ఇదే విధంగా అమ్మాయిలకు వల వేస్తుంటాడని తెలిసింది. విజయవాడలో తేజస్విని చదివే కళాశాలలో చదువుతున్న ఓ యువకుడు ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని అంజాద్కు ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తేజస్వినితో మాటలు కలిపి ప్రేమ పేరుతో వల వేశాడు. రెండేళ్ల కిందట విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ ఓ యువతిని ఇలానే ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ యువతిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. అంజాద్తో పాటు యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతులకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం.
గత ఏడాది అక్టోబర్లో మిస్సింగ్ కేసు నమోదు
తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని ట్రాప్ చేశాడు. కొంతకాలం సన్నిహితంగా మెలిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 28వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లారు. వెళ్లేటప్పుడు అంజాద్.. ఇంటి నుంచి కొంత నగదును తీసుకెళ్లినట్లు తెలిసింది. మరుసటి రోజు సాయంత్రం కూడా భీమవరం రాకపోయేసరికి.. కంగారు పడిన యువతి తల్లి విజయవాడ వచ్చి.. మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాచవరం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సోదరికి ఇన్స్టాలో మెసేజ్తో..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశంతో కదిలిన నగర పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వీరు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి వెళ్లినప్పటి నుంచి యువతిని ఇతరులతో మాట్లాడేందుకు అంగీకరించేవాడు కాదు. కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత కూడా ఫోన్ ఇవ్వలేదు. అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచి తన అక్కకు ఇన్స్ట్రాగ్రాంలో మెసేజ్ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు.. సోమవారం సాయంత్రం విజయవాడ పోలీసులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె అక్క ఫోన్ నుంచి తేజస్వినితో చాట్ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వారు ఎక్కడ ఉన్నారో.. స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇన్స్టాగ్రాం ద్వారా ప్రస్తుత లొకేషన్ పంపించమని అడిగారు. దీంతో కరెంట్ లొకేషన్ను యువతి పంపింది. అది వేరే దేశానిది చూపించడంతో పోలీసులు నిరుత్సాహానికి గురయ్యారు. అమెజాన్ ద్వారా ఇటీవల.. ఫొటోఫ్రేమ్ను బుక్ చేశారు. దీని తాలూకూ పార్శిల్ పెట్టెపై ఉన్న చిరునామాను ఫొటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. ఆ చిరునామాను వెంటనే జమ్మూ పోలీసులకు పంపించారు. వారు పరిశీలించి.. అది జమ్మూలోని గాంధీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రాంతంగా గుర్తించారు. వెంటనే బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి.. వారిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ సుఖాంతం అయింది.
ఫోన్లు, చెవి కమ్మలు అమ్మేసి..¸
కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతీ, యువకుల ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్లోని ఓ హోటల్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు హోటల్కు చేరుకునేసరికి అక్కడ నుంచి వీరు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆచూకీ అక్కడి సీసీ కెమెరాల్లోనూ లభించలేదు. అనంతరం డబ్బులకు ఇబ్బంది రావడంతో హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. తొలుత హైదరాబాద్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో కేరళకు వెళ్లి 10 రోజులు ఉన్నారు. అక్కడా ఇల్లు దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. అక్కడ తేజస్విని తన చెవి కమ్మలు, బంగారు వస్తువులను రూ.15వేలకు అమ్మేసింది. అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్లారు. కొంతకాలం తర్వాత మళ్లీ ముంబయికి.. అక్కడి నుంచి పూణే దిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి డబ్బులు అయిపోవడంతో.. రైలెక్కి జమ్మూ వెళ్లారు. అక్కడ తిరిగి తిరిగి ఓ హోటల్లో పనికి కుదిరాడు అంజాద్. హోటల్ యాజమాని కేటాయించిన గదిలో వీరిద్దరూ ఉంటున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో తేజస్విని, అంజాద్లు పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. డబ్బుల్లేక పలు చోట్ల రైళ్లలో టికెట్ కొనకుండానే ప్రయాణం చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో ఈశ్వరప్రసాద్ అరెస్టు
[ 05-07-2024]
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. -
నాగేంద్రాయ స్వాహా
[ 05-07-2024]
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. -
పోలవరం కుడి కాలువకు 2,832 క్యూసెక్కుల నీరు విడుదల
[ 05-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. -
రంగా ఆశయ సాధనకు కృషి
[ 05-07-2024]
దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
[ 05-07-2024]
రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. -
అన్నతోడు.. అరాచకమే చూడు
[ 05-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
పైపైన మెరుగులు.. లోలోన గుబులు!
[ 05-07-2024]
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో.. -
8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
[ 05-07-2024]
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. -
దుర్గమ్మా.. మన్నించమ్మా!
[ 05-07-2024]
విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి. -
నందిగామ పురపాలికపై తెదేపా పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు
[ 05-07-2024]
నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది. -
మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరిష్మా మృతి
[ 05-07-2024]
అజిత్సింగ్నగర్లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.