కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు.
నేడే పంపుల ద్వారా నీరు విడుదల
సరైన సమయంలో ఆదుకుంటున్న గోదావరి
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం నెల రోజులకే నిలుపుదల చేశారు. గోదావరిలో జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. గత ఏడాది మాత్రం పట్టిసీమ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పట్టిసీమకు, కృష్ణా డెల్టాకు మహర్దశ పట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పంపులను బుధవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి జలాలు చేరనున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీ అడుగంటి, పులిచింతల ఎండిపోయిన ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వరప్రదాయినిగా మారింది. గోదావరిలో ప్రస్తుతం 26.72 అడుగుల స్థాయిలో వరద ప్రవాహం ఉంది. కేవలం 14 అడుగులు దాటితే పట్టిసీమ ఎత్తిపోతలకు నీరు అందే అవకాశం ఉంది. పట్టిసీమ సామర్థ్యం 8,500 క్యూసెక్కులు. బుధవారం దాదాపు అన్ని పంపులను నిర్వహణలోకి తెచ్చి దాదాపు 6వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు, నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్కు 155.40 టీఎంసీలు కావాల్సి ఉంది. గత ఏడాది కృష్ణా డెల్టాకు 194.62 టీఎంసీలు వినియోగించినట్లు ఇంజినీర్లు లెక్కలు వేశారు. ఈ ఏడాది గోదావరి పొంగినా పట్టిసీమ నుంచి నీరు తీసుకోలేదు. పులిచింతలలో ఉన్న నీరు ఖాళీ చేశారు. మూసీ వరద రావడంతో 32.67 టీఎంసీలకు నీరు అదనంగా తీసుకున్నారు. గత ఏడాది వరదల వల్ల వచ్చిన జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. నీరు లేదని రెండో పంటకు విడుదల చేయలేదు. రబీకి క్రాప్ హాలిడే ప్రకటించారు. విజయవాడ నగరానికి తాగునీటికి కటకట అయింది. గ్రామీణంలోనూ చెరువుల వద్ద పోలీసు బలగాలను పెట్టి వేసవిలో తాగునీటి కోసం కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది పట్టిసీమ నీరు తీసుకోకపోవడం వల్ల డెల్టా రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
దిగుబడి పెరగనుంది..
గోదావరి జలాలు కృష్ణా డెల్టాలో పారితే వరి దిగుబడులు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇది 2016 ఖరీఫ్ నుంచి రుజువైంది. 2019 నుంచి 23 వరకు పాలకుల పుణ్యమాని గోదావరి జలాలు లేక వరి దిగుబడులు తగ్గాయి. మళ్లీ ఈ ఏడాది పట్టిసీమ నీరు అందిస్తున్నారన్న సమాచారం రైతుల్లో ఆనందం నింపుతోంది. కృష్ణా జలాల కన్నా గోదావరి జలాల్లో ఒండ్రు మట్టి ఎక్కువ ఉండి పోషకాలు అందుతాయని విశ్లేషిస్తున్నారు. పోలవరం కాలువ వెంట గన్నవరం నియోజకవర్గానికి మోటార్ల ద్వారా నీటిని తోడుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ, మాజీ ఎమ్మెల్యే వంశీ ఇద్దరూ విజ్ఞప్తి చేశారు.
- ఈనాడు, అమరావతి ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో ఈశ్వరప్రసాద్ అరెస్టు
[ 05-07-2024]
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. -
నాగేంద్రాయ స్వాహా
[ 05-07-2024]
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. -
పోలవరం కుడి కాలువకు 2,832 క్యూసెక్కుల నీరు విడుదల
[ 05-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. -
రంగా ఆశయ సాధనకు కృషి
[ 05-07-2024]
దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
[ 05-07-2024]
రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. -
అన్నతోడు.. అరాచకమే చూడు
[ 05-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
పైపైన మెరుగులు.. లోలోన గుబులు!
[ 05-07-2024]
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో.. -
8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
[ 05-07-2024]
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. -
దుర్గమ్మా.. మన్నించమ్మా!
[ 05-07-2024]
విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి. -
నందిగామ పురపాలికపై తెదేపా పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు
[ 05-07-2024]
నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది. -
మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరిష్మా మృతి
[ 05-07-2024]
అజిత్సింగ్నగర్లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.