అంకితభావంతో విధులు నిర్వహించండి
ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు
కారుణ్య నియామక పత్రం అందజేస్తున్న కలెక్టర్ బాలాజీ, పక్కన డీఆర్వో చంద్రశేఖరరావు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అర్హత సాధించిన ఐదుగురికి మంగళవారం కలెక్టర్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాలు పొందిన బి.రాజేంద్రను ఆడిట్ శాఖలో జూనియర్ ఆడిటర్గా, ఎం.అవినాష్ను రవాణా శాఖలో జూనియర్ అసిస్టెంట్గా, షేక్ జాస్మిన్ను విజయవాడ సర్వజనాసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్గా, ఎ.పవన్ను ఎన్టీఆర్ జిల్లాలో గ్రేడ్-2 గ్రామ రెవెన్యూ అధికారిగా, టీడీ పవన్కుమార్ను రవాణా శాఖలో కార్యాలయ సబార్డినేట్గా నియమించినట్టు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య పాల్గొన్నారు.
పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ..
కలెక్టరేట్(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు తగు రక్షణ కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. చట్టాన్ని అమలు చేసేందుకు కలెక్టర్ ఛైర్పర్సన్గా ఐదు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. మహిళలపై ప్రత్యేకశ్రద్ధ వహించే సామాజిక కార్యకర్తగా విశ్రాంత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సూవిజ్జు, సీడీపీవో సముద్రవేణి, బాలల హక్కుల ఫౌండేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ ఫ్రాన్సిస్, న్యాయసలహాదారుగా కోటేశ్వరమ్మలతో పాటు ఐసీడీఎస్ పీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా కమిటీలో ఉంటారన్నారు. ఈ కమిటీతో పాటు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించి పనిచేసే ప్రదేశాల్లోనూ ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్గత(ఇంటర్నల్) కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కమిటీలు సజావుగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల నుంచి 29 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎక్కడైనా మహిళలు వేధింపులు, హింసకు గురైనా, మాటలు, చేతల రూపంలో అసభ్య ప్రవర్తన బారిన పడినా వెంటనే అంతర్గత కమిటీలకు ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు అన్ని విధాలా అండ, రక్షణ కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఈవో విజయలక్ష్మి, సఖి కేంద్ర పరిపాలనాధికారి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, అంతర్గత కమిటీ సభ్యులు, నోడల్ అధికారులు వీసీకి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
[ 05-07-2024]
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. -
నాగేంద్రాయ స్వాహా
[ 05-07-2024]
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. -
పోలవరం కుడి కాలువకు 2,832 క్యూసెక్కుల నీరు విడుదల
[ 05-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. -
రంగా ఆశయ సాధనకు కృషి
[ 05-07-2024]
దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
[ 05-07-2024]
రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. -
అన్నతోడు.. అరాచకమే చూడు
[ 05-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
పైపైన మెరుగులు.. లోలోన గుబులు!
[ 05-07-2024]
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో.. -
8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
[ 05-07-2024]
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. -
దుర్గమ్మా.. మన్నించమ్మా!
[ 05-07-2024]
విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి. -
నందిగామ పురపాలికపై తెదేపా పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు
[ 05-07-2024]
నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది. -
మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరిష్మా మృతి
[ 05-07-2024]
అజిత్సింగ్నగర్లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు