వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది.
వైకాపా హయాంలో చక్రం తిప్పిన అధికారి
ఈనాడు, అమరావతి: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. ఎన్టీఆర్ జిల్లాలోని పలు దేవాలయాల పరిధిలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఈమెపై తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై బదిలీ వేటు వేస్తూ.. దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. కె.శాంతి విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో తన పై అధికారిపై ఇసుకపోసి.. వివాదాస్పదమయ్యారు. ఆ సమయంలో వైకాపాకు సంబంధించిన కీలక ఎంపీ అండదండలు ఆమెకు ఉండడంతో దేవాదాయశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా.. బాధితుడైన సదరు ఉన్నతాధికారిని అక్కడ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత.. శాంతిని తీసుకొచ్చి కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఈమెనే ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో అప్పటి నుంచి రెండు జిల్లాల పరిధిలో దేవదాయశాఖలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు, అవినీతికి పాల్పడిన వారికి కొమ్ముకాస్తూ వచ్చారు. తాజాగా ఈమెపై తొమ్మిది అభియోగాలతో ఛార్జెస్ ఫ్రేమ్ చేసి సస్పెన్షన్ వేటు వేశారు.
బాధ్యతల స్వీకరణ
కృష్ణా జిల్లాకు ఎన్.సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతరావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు. సీతారావమ్మ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో ఈశ్వరప్రసాద్ అరెస్టు
[ 05-07-2024]
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. -
నాగేంద్రాయ స్వాహా
[ 05-07-2024]
గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. -
పోలవరం కుడి కాలువకు 2,832 క్యూసెక్కుల నీరు విడుదల
[ 05-07-2024]
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం సాయంత్రానికి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోకి చేరినట్లు జలవనరులశాఖాధికారులు చెప్పారు. -
రంగా ఆశయ సాధనకు కృషి
[ 05-07-2024]
దివగంత వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవుదామని ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
రూ.2 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
[ 05-07-2024]
రానున్న అయిదేళ్లలో విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.2 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. -
అన్నతోడు.. అరాచకమే చూడు
[ 05-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
పైపైన మెరుగులు.. లోలోన గుబులు!
[ 05-07-2024]
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో.. -
8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు
[ 05-07-2024]
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్ జి.సృజన వెల్లడించారు. -
దుర్గమ్మా.. మన్నించమ్మా!
[ 05-07-2024]
విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డు చిన్న గోపురం ముందున్న పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మహామండపం గోడలకు పిచ్చిమొక్కలు మొలిచాయి. చెట్ల పొదలు పెరిగిపోయాయి. -
నందిగామ పురపాలికపై తెదేపా పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు
[ 05-07-2024]
నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది. -
మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరిష్మా మృతి
[ 05-07-2024]
అజిత్సింగ్నగర్లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.