నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అమరుడైన సైనికుడికి అశ్రునివాళి
సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు
చెమ్మగిల్లిన చేవేండ్ర
నాగరాజు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచుతున్న కృష్ణా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీమ్ అస్మీ
మువ్వన్నెలపై అనురాగం..
భరతజాతిపై మమకారం..
దేశరక్షణకు సంకల్పించి..
వినమ్రుడవై అడుగేశావు...
సేవకుడై ఉరికావు..
సైనికుడై నిలిచావు..
ఉన్నతంగా ఎదిగావని..
ఊరంతా మురిసేలోపు...
కల నెరవేర్చుకున్నావని..
కన్నోళ్లు సంతోషించేలోపు..
కలలను కూల్చిన వరద..
కడలిని మించిన వేదన..
నీవు లేకున్నా..
నీ స్ఫూర్తి మరువం..
నీవు రాకున్నా..
నీ కీర్తి పదిలం..
పెడన, న్యూస్టుడే: లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకముందు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన నాగరాజు మృతదేహాన్ని ఆర్మీ వాహనంలో చేవేండ్రకు సాయంత్రం 6గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. అనంతరం సైనిక లాంఛనాలతో రాత్రి 9 గంటల ప్రాంతంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు
కుటుంబానికి ప్రభుత్వం అండ: కలెక్టర్ బాలాజీ
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ, ఆర్డీవో వాణి తదితర ప్రముఖులు నాగరాజు పార్థివదేహానికి చేవేండ్రలో నివాళులర్పించారు. దేశరక్షణలో అసువులు బాసిన నాగరాజు త్యాగాన్ని ఈ దేశం మరువదని కలెక్టర్ అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, కలెక్టర్లు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
తరలివచ్చిన ప్రజలు: నాగరాజు మృతదేహాన్ని చూసేందుకు చేవేండ్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో రహదారులు జనంతో నిండిపోయాయి. మచిలీపట్నం-గుడివాడ రహదారిపై వడ్లమన్నాడు నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న చేవేండ్రకు ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. దారి పొడవున ప్రజలు అమర్రహే నాగరాజు అంటూ నివాళులర్పించారు. అనంతరం ఇంటి వద్ద కుటుంబ ఆచారం ప్రకారం క్రతువు పూర్తిచేసిన అనంతరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ప్రసాద్, సీఐ నాగేంధ ప్రసాద్, తహసీల్దార్ రాంబాబు, ఆర్ఐ మణికుమార్, ఎంపీడీవో రెడ్డియ్య ఎస్సై సూర్యశ్రీనివాస్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
మంత్రి నారా లోకేశ్ సంతాపం
తాడేపల్లి: ముగ్గురు జవాన్ల మృతిపై మంత్రి నారా లోకేశ్ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. లద్దాఖ్ ప్రమాదంలో నాగరాజు, సుభానాఖాన్, ఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్మశానవాటికలో సైనిక వందనం
తీవ్రంగా కలచివేసింది: బాలశౌరి
మచిలీపట్నం (గొడుగుపేట): లద్దాఖ్ ప్రమాదంలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. నాగరాజు, రామకృష్ణారెడ్డి, సుభాన్ఖాన్ల మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుడు నాగరాజు మృతికి తెదేపా నేతలు బూరగడ్డ వేదవ్యాస్, కొనకళ్ల నారాయణరావు, జనసేన నాయకుడు బండి రామకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
[ 04-07-2024]
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. -
వంచకుడు అంజాద్పై కేసు
[ 04-07-2024]
జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. -
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
[ 04-07-2024]
గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు. -
కిట్ చేతపట్టి..లెక్కల పని పట్టు!
[ 04-07-2024]
విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్ కిట్’ను తయారు చేశారు. -
భరోసా నింపిన మంత్రి పర్యటన
[ 04-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. -
పుట్టగానే కవల శిశువుల మృతి
[ 04-07-2024]
పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. -
దస్త్రాలు దహనం.. పెదపులిపాక వద్ద కలకలం
[ 04-07-2024]
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భార్య చేతిలో భర్త హతం
[ 04-07-2024]
పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. -
పట్టిసీమ పరవళ్లు
[ 04-07-2024]
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. -
పథకమేసి.. దోపిడీ చేసి రూ. 80 లక్షల చోరీ
[ 04-07-2024]
తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు
[ 04-07-2024]
తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
[ 04-07-2024]
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్