కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది.
కృష్ణలంక, న్యూస్టుడే: ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం... పద్మావతి ఘాట్ సమీపంలోని రైలు వంతెన దిగువ కృష్ణా నదిలో సోమవారం మృతదేహం తేలియాడుతున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మగ వ్యక్తిగా నిర్ధారించారు. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లుగా భావిస్తున్నారు. శరీరంపై నీలిరంగు టీషర్టు, అదే రంగు కలిగిన నిక్కరు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో సీఆర్పీసీ 174కు బదులు మారిన కొత్త నేర చట్టాల్లో భాగంగా బీఎన్ఎస్ఎస్ (భారతీయ నాగరిక సురక్ష సంహిత-194(1) కింద కేసు నమోదు చేశారు. ఉదయం 11 గంటలకు ఫిర్యాదు రాగా 12 గంటలకు కొత్త చట్టంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
[ 04-07-2024]
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. -
వంచకుడు అంజాద్పై కేసు
[ 04-07-2024]
జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. -
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
[ 04-07-2024]
గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు. -
కిట్ చేతపట్టి..లెక్కల పని పట్టు!
[ 04-07-2024]
విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్ కిట్’ను తయారు చేశారు. -
భరోసా నింపిన మంత్రి పర్యటన
[ 04-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. -
పుట్టగానే కవల శిశువుల మృతి
[ 04-07-2024]
పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. -
దస్త్రాలు దహనం.. పెదపులిపాక వద్ద కలకలం
[ 04-07-2024]
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భార్య చేతిలో భర్త హతం
[ 04-07-2024]
పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. -
పట్టిసీమ పరవళ్లు
[ 04-07-2024]
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. -
పథకమేసి.. దోపిడీ చేసి రూ. 80 లక్షల చోరీ
[ 04-07-2024]
తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు
[ 04-07-2024]
తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
[ 04-07-2024]
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్