logo

పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు

Published : 02 Jul 2024 05:07 IST

బురదలో ఇరుక్కున్న లారీ

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గుడివాడ - పామర్రు రోడ్డులో భీమవరం రైల్వే గేటు ప్రాంతంలో పైవంతెన నిర్మాణ పనులు కొలిక్కి రాకపోవడంతో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతమంతా బురద కయ్యగా మారింది. సోమవారం అక్కడ ఓ వృద్ధురాలు వాహనం నుంచి బురదలో జారిపడి కాలు విరిగింది. తరచూ ఇక్కడ వాహనాలు బురదలో ఇరుక్కుపోతూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డు పక్కన తవ్వి డ్రెయిను నిర్మిస్తున్నారు. దాని పక్కన బురద ఉండడం.. వర్షం రావడంతో వాహన చోదకులు జారి పడుతున్నారు. సర్వీసు రోడ్డులో గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వాహనం నుంచి జారిపడి కాలు విరిగిన వృద్ధురాలికి సపర్యలు చేస్తూ..

రైలు గేటు వద్ద ఆగిన ట్రాఫిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని