logo

భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్‌లకు నిప్పు

భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్‌లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్‌లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 02 Jul 2024 05:06 IST

శ్యాంప్రసాద్‌ ఇంట్లో దహనమైన వాహనాలు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్‌లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్‌లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలపూడి సీఐ సత్యన్నారాయణ కథనం ప్రకారం.. ఈడేపల్లికి చెందిన శ్యాంప్రసాద్‌ కుమార్తెను రెండేళ్ల కిందట మచిలీపట్నంకు చెందిన శబరీనాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేని ఆమె కొంత కాలంగా పుట్టింటి వద్దే ఉంటోంది. తన భార్యను కాపురానికి రానీయకుండా అత్తమామలే కుట్ర చేస్తున్నారన్న భావంతో ద్వేషం పెంచుకున్న శబరీనాథ్‌ సోమవారం తెల్లవారుజామున ఈడేపల్లిలోని అత్తవారింట్లో పార్కింగ్‌ చేసి ఉన్న మూడు బైక్‌లపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. సమీపంలో ఉన్న వారి బంధువుల ఇంట్లోని రెండు బైక్‌లు తగలబెట్టాడు. పక్కనే ఉన్న కారు సైతం కాలిపోయింది. అక్కడికీ కసి తీరక శ్యాంప్రసాద్‌కు ఫోన్‌ చేసి ప్రస్తుతం వాహనాలనే తగలబెట్టానని, తీరుమార్చుకోకుంటే ఇంట్లోని మనుషులకు అదే గతి పడుతుందని హెచ్చరించాడు. శ్యాంప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని