స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు.
రోడ్డు కంటే అడుగున్నర ఎత్తులో నిర్మించిన కాలువలు
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. 2022 జులై 14న గ్రామంలో మంచినీటి సరఫరా పైప్లైన్ లీకు అయ్యింది. డ్రెయిన్లో వేసిన పైప్లైన్లోకి మురుగు ప్రవేశించడంతో గ్రామస్థులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వర్షాకాలం నేపథ్యంలో తొలుత సాధారణ వాంతులు, విరేచనాలుగా అధికారులు భావించారు. పరిస్థితి విషమించి నలుగురు చనిపోవడంతో స్థానికంగా వైద్యశిబిరాల ఏర్పాటు, అరకొర పారిశుద్ధ్య చర్యలతో మమ అనిపించారు. అప్పటి జిల్లా కలెక్టర్ రంజిత్బాషా సహా అధికార యంత్రాంగం మొత్తం వారం పాటు గ్రామంలో ఉండి పరిస్థితిని కుదుటపడే వరకు పర్యవేక్షించారు. కానీ గ్రామంలో మంచినీటి సరఫరా లోపాలు, అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదు కానీ తూతూమంత్రంగా చేపట్టిన పనులతో కొత్త సమస్యలను వైకాపా నాయకులు సృష్టించారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మొదలైన వర్షాకాలం ఈసారి ఎంతమందిని కాటేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్డు నిర్మించకుండా అడుగున్నర ఎత్తులో మట్టి పోయడంతో బురదగా మారిన బల్లిపర్రు- తెంపల్లె రోడ్డు
కాలువలో సిల్ట్ తీయకపోవడంతో నిండిపోయి రోడ్డుపై పారుతున్న మురుగు
ఈనాడు కృష్ణా, గన్నవరం గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
[ 04-07-2024]
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. -
వంచకుడు అంజాద్పై కేసు
[ 04-07-2024]
జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. -
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
[ 04-07-2024]
గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు. -
కిట్ చేతపట్టి..లెక్కల పని పట్టు!
[ 04-07-2024]
విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్ కిట్’ను తయారు చేశారు. -
భరోసా నింపిన మంత్రి పర్యటన
[ 04-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. -
పుట్టగానే కవల శిశువుల మృతి
[ 04-07-2024]
పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. -
దస్త్రాలు దహనం.. పెదపులిపాక వద్ద కలకలం
[ 04-07-2024]
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భార్య చేతిలో భర్త హతం
[ 04-07-2024]
పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. -
పట్టిసీమ పరవళ్లు
[ 04-07-2024]
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. -
పథకమేసి.. దోపిడీ చేసి రూ. 80 లక్షల చోరీ
[ 04-07-2024]
తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు
[ 04-07-2024]
తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
[ 04-07-2024]
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ