వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు.
రెబల్స్గా బరిలో ఇద్దరు
సభ్యుల ఏకగ్రీవానికి చెల్లుచీటీ!
తెదేపా నుంచి నామపత్రాలు దాఖలు చేస్తున్న చెన్నగిరి రామ్మోహనరావు
విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్టుడే : నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. మరోవైపు తెదేపా పక్షం అభిప్రాయాన్ని వైకాపా తోసిపుచ్చడంతో ఆ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థిని దింపింది. ఫలితంగా స్థాయీ సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి వైకాపా పాలకపక్షంలో ఆందోళన రేపుతుండగా, వర్గ విబేధాలు బయటపడ్డాయి.
హెచ్ఎంటీ చట్టం ప్రకారం...
హెచ్ఎంటీ చట్టం 2010లో తెచ్చిన మార్పుల తర్వాత వార్డు కమిటీలు మాయమయ్యాయి. మేయర్గా ఎవరుంటే వారే స్థాయీ సంఘం ఛైర్మన్గా కొనసాగుతున్నారు. స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఏటా జరిగే స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికతో నూతన స్థాయీ సంఘాన్ని (స్టాండింగ్ కమిటీ) ఏర్పాటు చేస్తారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఏడాది వరకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కార్పొరేటర్లే మూడు నియోజకవర్గాల నుంచి ఇద్దరు చొప్పున ఏకగీవ్రంగా ఎన్నికయ్యేవారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మారిపోయి, కూటమి అధికారంలోకి రావడం, ముగ్గురు వైకాపా శాసనసభ్యులు ఓడిపోవడంతో ఆ ప్రభావం నగరపాలక సంస్థ పాలకపక్షంపై పడింది. అదే సమయంలో వైకాపాలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. ఎవరికి వారే తమ స్థాయిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా మేయర్, వైకాపా ఫ్లోర్లీడర్, డిప్యూటీ మేయర్లు తమకు అనుకూలమైన కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసినా వైకాపా అధిష్ఠానం పట్టీపట్టనట్టు వ్యవహరించింది. ఫలితంగా స్థాయీ సంఘం ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు వైకాపా నాయకులు వెనుక నుంచి పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏకగ్రీవానికి గండికొట్టేలా తమ వారిని పోటీకి దించినట్లు చెబుతున్నారు.
సమతుల్యత దెబ్బతినడమేనా?
ఇప్పటి వరకు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికల్లో ఓ బలమైన సామాజికవర్గానికి చోటు దక్కుతూ వచ్చింది. మరో సామాజికవర్గానికి తగిన చోటు దక్కడం లేదన్న అసంతృప్తి కొందరిలో ఉంది. అది ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో అది బయట పడింది. ఫలితంగా పాలకపక్షం ఎంపిక చేసిన ఆరుగురు వైకాపా సభ్యులకు వ్యతిరేకంగా, ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు స్థాయీ సంఘం సభ్యులుగా పోటీ చేసేందుకు నామపత్రాలు దాఖలు చేశారు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో తెదేపా జోరుమీద ఉంది. తమ పార్టీలోని ఒకరిద్దరు కార్పొరేటర్లకు స్థాయీ సంఘంలో స్థానం కల్పించాలని మేయర్ను కలిసి విన్నవించారు. వైకాపాలో వర్గపోరుతో తెదేపాకు సానుకూల సాంకేతాలు అందలేదు. దీంతో తెదేపా ఎన్నికల బరిలోకి దిగింది. 32వ డివిజన్ తెదేపా కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహనరావును ఆ పార్టీ బరిలోకి దించింది. కౌన్సిల్లో సాంకేతికంగా తెదేపాకు 13 ఓట్లు ఉండగా, వైకాపా వర్గ విభేదాలు తమకు కలిసి వస్తాయని తెదేపా ఆశతో ఉంది.
ఒంటెత్తుపోకడలతో...
వైకాపా నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ప్రస్తుతం స్థాయీ సంఘం ఎన్నికల బరిలోకి దిగారు. పశ్చిమ నుంచి 48వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అత్తిలి ఆదిలక్ష్మి రెబల్గా నామపత్రాలు దాఖలు చేయగా, 53వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ మహదేవు అప్పాజీరావు బలపర్చారు. మధ్య నుంచి వైకాపా రెబల్గా భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి పోటీకి దిగగా, 45వ డివిజన్ వైకాపా అసోసియేట్ కార్పొరేటర్ మైలవరపు మాధురీ లావణ్య బలపపర్చారు. వారు రెబల్స్గా బరిలో దిగడానికి అంతర్గత విభేదాలు, పార్టీ నాయకుల ఒంటెద్దుపోకడలే కారణాలుగా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?
[ 04-07-2024]
సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. -
వంచకుడు అంజాద్పై కేసు
[ 04-07-2024]
జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. -
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
[ 04-07-2024]
గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు. -
కిట్ చేతపట్టి..లెక్కల పని పట్టు!
[ 04-07-2024]
విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్ కిట్’ను తయారు చేశారు. -
భరోసా నింపిన మంత్రి పర్యటన
[ 04-07-2024]
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. -
పుట్టగానే కవల శిశువుల మృతి
[ 04-07-2024]
పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. -
దస్త్రాలు దహనం.. పెదపులిపాక వద్ద కలకలం
[ 04-07-2024]
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన కొన్ని కీలక దస్త్రాలు బుధవారం రాత్రి పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద దహనం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
భార్య చేతిలో భర్త హతం
[ 04-07-2024]
పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. -
పట్టిసీమ పరవళ్లు
[ 04-07-2024]
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. -
పథకమేసి.. దోపిడీ చేసి రూ. 80 లక్షల చోరీ
[ 04-07-2024]
తాను పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ. 80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. -
వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు
[ 04-07-2024]
తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. -
విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
[ 04-07-2024]
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు
-
కల్కి సినిమా టికెట్ ధర పెంపుపై హైకోర్టులో పిల్
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్