logo

ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు

ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్‌ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 02 Jul 2024 04:54 IST

ఎంఏ భగవద్గీత సైతం..

విజయవాడ వన్‌టౌన్‌: ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్‌ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్మెంట్‌ అనే నాలుగు కోర్సులను సెమిస్టర్‌ విధానంలో ప్రవేశపెట్టామన్నారు. ఒక్కో సెమిస్టర్‌ ఫీజు రూ.15,500ల నుంచి రూ.19500ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయన్నారు. ఎంఏ భగవద్గీత అధ్యయనం కోర్సును కూడా ప్రారంభించామన్నారు. మరిన్ని వివరాలకు కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని కానీ, 0866-2565253 నంబర్‌లో గానీ సంప్రదించాలన్నారు. జులై 15వ తేదీ ప్రవేశాలకు తుది గడువుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని