గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సమావేశం రసాభాస
విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్ వేమూరి వెంకట్రావ్ను డిపాజిటర్లు నిలదీశారు.
పత్రికల్లో కథనాలపై ఛైర్మన్ను నిలదీసిన ఖాతాదారులు
అక్రమాలు, అవినీతి నిగ్గు తేల్చాలని డిమాండ్
కరెన్సీనగర్, న్యూస్టుడే: విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్ వేమూరి వెంకట్రావ్ను డిపాజిటర్లు నిలదీశారు. లెక్కలు చూపించాలని, ఖాతాదారుల సొమ్మును, అధిక వడ్డీల రూపంలో దోచేసిన వ్యక్తుల వివరాలు బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. అన్నింటికీ సమాధానాలు చెబుతానని వెంకట్రావు హామీ ఇవ్వగా.. అతని తీరు నచ్చక కొంతమంది వెళ్లిపోయారు. కొంతమంది అడిగిన కొన్ని ప్రశ్నలకు ఛైర్మన్ సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారు. బ్యాంకు మహాజన సభ (సర్వసభ్య సమావేశం) ఆదివారం విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో నిర్వహించారు. ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన వారినే సమావేశానికి అనుమతించారు. మీడియాను లోపలికి పంపించలేదు. సమావేశం వివరాలు బయటకు వెళ్లకుండా ఛైర్మన్ నేతృత్వంలో సిబ్బంది శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల పహారా పెట్టారు. తొలుత 2023-24 ఆర్థిక సంవత్సర బ్యాంకు లావాదేవీలపై చర్చ జరిగింది. ఆ సమయంలో కొంత మంది సభ్యులు, ఖాతాదారులు పత్రికల్లో వచ్చిన కథనాలకు సమాధానాలు చెప్పాలని నిలదీశారు. కాసేపు ఛైర్మన్ మాట్లాడినా సభ్యులు అంగీకరించలేదు. గొడవ పెద్దది అవుతున్న తరుణంలో సభ్యులు, ఖాతాదారులను బుజ్జగించేందుకు కొందరు డైరెక్టర్లు ప్రయత్నించారు. తమ వైపున్న తప్పులు కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. భోజన సమయం వరకు జరగాల్సిన సమావేశాన్ని త్వరగా ముగించేందుకు ఉత్సాహం చూపారు. సమావేశానికి డైరెక్టర్లు కోగంటి వెంకట రామయ్య, జోగరాజు, తల్లాప్రగడ సుబ్బారావు, కళ్లే నాగేశ్వరరావు హాజరు కాలేదు. పాలకమండలి వైస్ ఛైర్మన్ అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ, డైరెక్టర్లు సగ్గుర్తి నాగేశ్వరరావు, ఆంజనేయరాజు, ఎస్.వెంకటేశ్వరరావు, భోగాది శివరామకృష్ణప్రసాద్, సజ్జా వెంకట నాగసుభాష్ తేజ, సీఈవో పద్మిని, ఖాతాదారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకులో దగాకోరులు!
[ 03-07-2024]
విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది -
ప్రేమ పేరుతో వల
[ 03-07-2024]
హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దుర్గగుడి చీరల వ్యవహారంపై ఆడిట్ అభ్యంతరాలు
[ 03-07-2024]
దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి -
కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
[ 03-07-2024]
మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఆయిల్ లేదా భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు
[ 03-07-2024]
ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది. -
అంకితభావంతో విధులు నిర్వహించండి
[ 03-07-2024]
ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు -
పెడన-విస్సన్నపేట హైవే విస్తరణకు సన్నాహాలు
[ 03-07-2024]
రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు -
వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు
[ 03-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. -
అక్రమ బట్టీలపై రెవెన్యూ అధికారుల కొరడా
[ 03-07-2024]
ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు