గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు.
పనస పండ్ల మధ్య సరకు తరలిస్తుండగా పోలీసుల దాడులు
శామీర్పేట, పేట్బషీరాబాద్, న్యూస్టుడే: రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్ 28న హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండం వైపు.. అవుటర్ రింగ్రోడ్డు టోల్గేట్ సమీపంలో ఓ బొలెరో వాహనం పనస పండ్ల లోడ్తో ప్రయాణిస్తోంది. ఎస్కార్టుగా స్మగ్లర్లు ఓ కారులో ముందు వెళుతున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు, శామీర్పేట పోలీసులు సంయుక్తంగా ఆ రెండు వాహనాలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. పనస పండ్ల మధ్యలో 33 కిలోల గంజాయిని స్వాధీనంచేసుకుని రెండు వాహనాల్లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన శివ ఏపీలోని రాజమండ్రిలో నివాసముంటూ వివిధ రాష్ట్రాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఆయన సూచనలతో ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన గేదెల సతీష్(34), కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కోరాడ సాయికుమార్(26), విశాఖపట్నం జిల్లా కె.కోటపాడుకు చెందిన బండారు శివకుమార్(27) ఒడిశాలో 33 కిలోల గంజాయిని 16 బండిళ్లుగా ప్యాకింగ్ చేసుకుని పనసపండ్ల లోడ్ మధ్య దాచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి రెండు వాహనాలు, గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు చరవాణిలు, రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, సాయికుమార్పై ఏపీలోని పలు ఠాణాల్లో గంజాయి స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు.
కారు సిలిండర్లో గంజాయి.. నిందితుడి అరెస్టు
హైదరాబాద్ (నాగోలు), న్యూస్టుడే : కారులో అమర్చిన ఖాళీ గ్యాస్ సిలిండర్లో గంజాయి తరలిస్తున్న నిందితుడిని ఆదివారం ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం, నాగోలు ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పైదురుపాడు గ్రామానికి చెందిన బోయినిపల్లి సురేశ్ (35) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవరు. సులువుగా డబ్బు సంపాదించేందుకు.. గంజాయి సరఫరా చేసే పాత నేరస్థుడి సూచన మేరకు కారు డిక్కీ లో గ్యాస్ సిలిండర్ను అమర్చాడు. ఆ ట్యాంకులో గంజాయి అమర్చి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. 31.2 కిలోల గంజాయిని సిలిండర్లో ఉంచి విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా నిజామాబాద్కు తరలిస్తుండగా.. ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఇదే విధంగా గంజాయి తరలిస్తుండగా 2022లోనూ సురేశ్పై భద్రాచలం ఠాణాలో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకులో దగాకోరులు!
[ 03-07-2024]
విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది -
ప్రేమ పేరుతో వల
[ 03-07-2024]
హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దుర్గగుడి చీరల వ్యవహారంపై ఆడిట్ అభ్యంతరాలు
[ 03-07-2024]
దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి -
కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
[ 03-07-2024]
మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఆయిల్ లేదా భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు
[ 03-07-2024]
ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది. -
అంకితభావంతో విధులు నిర్వహించండి
[ 03-07-2024]
ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు -
పెడన-విస్సన్నపేట హైవే విస్తరణకు సన్నాహాలు
[ 03-07-2024]
రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు -
వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు
[ 03-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. -
అక్రమ బట్టీలపై రెవెన్యూ అధికారుల కొరడా
[ 03-07-2024]
ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించాడు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!