జిల్లా అంతటా భారీ వర్షాలు
జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం..
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. తిరువూరు 69.4 మి.మీ., జి.కొండూరు 62.6, రెడ్డిగూడెం 60.2, మైలవరం 54.4, విస్సన్నపేట 52.2, జగ్గయ్యపేట 50.2, ఇబ్రహీంపట్నం 45.2, పెనుగంచిప్రోలు 43.6, వీరులపాడు 43.4, చందర్లపాడు, విజయవాడ తూర్పు 40.4, విజయవాడ ఉత్తరం 40.2, విజయవాడ సెంట్రల్, పశ్చిమ 39.4, నందిగామ 38.8, కంచికచర్ల, విజయవాడ గ్రామీణ 37.2, ఎ.కొండూరు 35.4, గంపలగూడెం 34.4, వత్సవాయిలో 32.2 మి.మీ. మేర వర్షం పడింది. జిల్లాలో సగటు వర్షపాతం 44.81 మి.మీ.గా ఉంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
చెరువును తలపిస్తున్న పామర్రు బస్టాండు
గుడివాడ పట్టణం, పామర్రు, న్యూస్టుడే: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఇబ్బందికరంగా మారింది. గుడివాడ, పామర్రు బస్టాండ్లలో వాన నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. లోపలికి వెళ్లేందుకు ఆస్కారం లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని బస్సులు బస్టాండులోకి రాకుండానే రోడ్లపై ఆపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోయారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండు నాలుగు వైపులా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బస్టాండు నిర్మాణానికి కాలయాపన చేయడంతో వర్షం కురిసినప్పుడల్లా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.
గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ వెనుక కాలనీలోని ప్రధాన రహదారి దుస్థితి..
గుడివాడ ఆర్టీసీ బస్టాండు దక్షిణం వైపు ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకులో దగాకోరులు!
[ 03-07-2024]
విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది -
ప్రేమ పేరుతో వల
[ 03-07-2024]
హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దుర్గగుడి చీరల వ్యవహారంపై ఆడిట్ అభ్యంతరాలు
[ 03-07-2024]
దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి -
కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
[ 03-07-2024]
మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఆయిల్ లేదా భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు
[ 03-07-2024]
ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది. -
అంకితభావంతో విధులు నిర్వహించండి
[ 03-07-2024]
ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు -
పెడన-విస్సన్నపేట హైవే విస్తరణకు సన్నాహాలు
[ 03-07-2024]
రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు -
వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు
[ 03-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. -
అక్రమ బట్టీలపై రెవెన్యూ అధికారుల కొరడా
[ 03-07-2024]
ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!