ఉపాధి బకాయిల విడుదల ఎప్పుడో?
వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు.
కంచికచర్ల, న్యూస్టుడే
వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు. పని కోరుకున్న ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలన్నదే పథకం ఉద్దేశం. ప్రస్తుతం పని చేసిన కూలీలకు వేతనాలు వెంటనే అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా పథకం పరిధిలో మొత్తం 16 బ్లాకులు, 289 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్ కార్డుదారులు 1.72 లక్షల మంది ఉండగా.. వాటి ద్వారా ఉపాధి పొందుతున్న మొత్తం కూలీల సంఖ్య 2.99 లక్షలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 57.52 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పని చేసిన ప్రతి కూలీకి వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి అప్పటివరకు చేసిన పని దినాలకు వచ్చే నగదును లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఏడాది మే 20వ తేదీ వరకు కూలీలకు నగదు మంజూరు చేశారు. దాదాపు 5 వారాల నగదు బకాయి ఉంది. ఇప్పటివరకు ఉన్న బకాయి మొత్తం రూ.51.35 కోట్లుగా అధికారులు తెలిపారు. కొంత మంది కూలీలకు ఏడు వారాలకు పైగా నగదు బకాయి ఉన్నట్లు సమాచారం. బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు.
త్వరలో విడుదల
- సునీత, పీడి, డ్వామా
గతంలోనూ రెండు మూడు వారాలకు నగదు వచ్చేది. ఈ సారి కొంత ఆలస్యమైన మాట నిజమే. గత మే 20 వరకు అందరికీ నగదు చెల్లించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతాయి. పది రోజుల్లో బకాయి నగదు చెల్లించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకులో దగాకోరులు!
[ 03-07-2024]
విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది -
ప్రేమ పేరుతో వల
[ 03-07-2024]
హైదరాబాద్లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దుర్గగుడి చీరల వ్యవహారంపై ఆడిట్ అభ్యంతరాలు
[ 03-07-2024]
దేవాదాయ శాఖలో గడచిన ఐదేళ్లలో జరిగిన అవినీతిపై పాపాల పుట్ట బద్దలైంది. దేవాదాయ శాఖ సహాయ కమిషనరు సస్పెండ్ అయిన విషయం వెలుగు చూసిన వెంటనే దుర్గగుడిలో భక్తులు సమర్పించిన విలువైన పట్టు చీరల సమర్పణపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి -
కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం
[ 03-07-2024]
ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. -
మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
[ 03-07-2024]
మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇండియన్ ఆయిల్ లేదా భారత్ పెట్రోలియం ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. -
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు
[ 03-07-2024]
ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఉమ్మడి కృష్ణాలో ప్రక్రియ మొదలైంది. -
అంకితభావంతో విధులు నిర్వహించండి
[ 03-07-2024]
ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు -
పెడన-విస్సన్నపేట హైవే విస్తరణకు సన్నాహాలు
[ 03-07-2024]
రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు -
వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు
[ 03-07-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. -
అక్రమ బట్టీలపై రెవెన్యూ అధికారుల కొరడా
[ 03-07-2024]
ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను అంతమొందించిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ