ఫుట్పాత్లే ఆధారం
కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు.. తల్లిదండ్రులు తిట్టారని మరొకరు.. దారిలేక కొందరు.. దారి తప్పి మరికొందరు.. పని కోసం ఒకరు.. పనిలేక ఇంకొకరు. ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు.
నగరంలో నిరాశ్రయుల నరకయాతన
సరిపడా లేని వసతి గృహాలు
దుర్గగుడి సమీపంలో ఫుట్పాత్పై నిద్రిస్తున్న అభాగ్యులు
ఫుట్పాత్పై వరుసగా పక్కపక్కనే నిద్రిస్తున్న వీరంతా ఒక ఊరోళ్లు కాదు.. కనీసం ఒక ప్రాంతానికి చెందినవారూ కాదు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి విజయవాడకు వచ్చిన నిరాశ్రయులు. రోజూ నగరంలోని దుర్గగుడి సమీపంలోని ఫుట్పాత్పై ఇలా పడుకుంటారు. ఉదయం ఎవరి పనికి వారు వెళ్లి రాత్రయ్యేసరికి ఇలా ఒకచోటికి చేరి నిద్రిస్తారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు.. తల్లిదండ్రులు తిట్టారని మరొకరు.. దారిలేక కొందరు.. దారి తప్పి మరికొందరు.. పని కోసం ఒకరు.. పనిలేక ఇంకొకరు. ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు. వీరిలో అధిక శాతం మంది మద్యానికి బానిసలై ఇంటి నుంచి వచ్చేసినవారే. వారు ఉదయమంతా ఏదోఒక పనిచేస్తూ.. లేదంటే ఎక్కడోచోట గడిపేస్తున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఫంక్షన్ హాల్స్ల్లో జరిగే కార్యక్రమాల్లో మిగిలే ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించే ఆహారంతో కడుపు నింపుకొంటున్నారు. ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు దారితప్పి తమిళనాడు, చత్తీస్గఢ్ ఒడిశా, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి రోడ్డుపాలైన వారు నగరంలో చాలా మంది ఉన్నారు.
రెండు వేల మందికి పైగా..
విజయవాడ నగరంలో సుమారు రెండు వేల మంది వరకూ.. రోడ్ల పక్కనే జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు, రైల్వేస్టేషన్, బస్టాండ్, కృష్ణానది ఒడ్డున, దుర్గగుడి ఫ్లైఓవర్ కింద, ప్రకాశం బ్యారేజీ ఫుట్పాత్పై నిద్రిస్తున్నారు. ఉదయం లేచిన తర్వాత.. నగరపాలక సంస్థ మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కాలకృత్యాలు తీర్చుకుని, బయలుదేరి తమకు పనిదొరికే ప్రదేశాలకు వెళ్లిపోతారు. మళ్లీ.. రాత్రయ్యేసరికి పడుకునేందుకు ఇదే ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
బీఆర్టీఎస్ రోడ్డులో..
నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు ఇది. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు.. రోజూ వందల మంది నిరాశ్రయులు రాత్రి వేళ ఇక్కడ పడుకుంటారు. రోజంతా ఏదో ఒక పనిచేసుకుని రాత్రయ్యే సరికి ఇక్కడికి వస్తారు. నగరంలో ఎక్కడా సరిపడా వసతిగృహాలు లేక వీరంతా ఇలా రోడ్లుపై జీవనం సాగిస్తున్నారు.
నగరం మొత్తంలో నాలుగే గృహాలు..
నగరంలో వేల మంది నిరాశ్రయులు రోడ్లపై దిక్కుతోచని స్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నగరంలో ప్రతి లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఒక నిరాశ్రయ వసతి గృహం ఉండాలి. కానీ.. సుమారు 12 లక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ మున్సిపాలిటీలో మాత్రం కేవలం నాలుగే ఉన్నాయి. వీటిని పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మున్సిపాలిటీ అధికారులు నడిపిస్తున్నారు. వీటిలోనూ కృష్ణలంక వసతి గృహ సామర్థ్యం 50మంది ఉండగా.. సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. మిగిలిన మూడింటిలో ఒక్కో దాంట్లో సుమారు వంద మంది వరకు ఆశ్రయం పొందొచ్చు. సుమారు 2 వేలకు పైగా ఉన్న నిరాశ్రయులకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలో భోజన వసతి కూడా లేదు. నిరాశ్రయులు గృహాల్లో ఉండటానికి గుర్తింపు కార్డు ఉండాలి. చాలామందికి లేకపోవడంతో గృహాలకు రావడం లేదు. మహిళల కోసం ఒక్క వసతి గృహం కూడా లేదు.
మా గురించి ఆలోచించాలి
మాది నూజివీడులోని వెలమల కాలనీ. ఎటువంటి ఆస్తులు లేవు. నా భార్య, నేను పొలం పనులకు కూలీగా వెళ్తూ జీవనం కొనసాగించే వాళ్లం. నా కుమారుడుకి పదేళ్ల కిందట పెళ్లిచేశాం. తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వారి నుంచి విడిపోయి.. మేమిద్దరమే ఓ అద్దింట్లో ఉంటున్నాం. కరోనాతో నా భార్య మృతి చెందింది. తర్వాత ఏం చేయాలో తోచక విజయవాడ వచ్చేశాను. ఏదైనా హోటల్లో పని దొరికితే చేస్తాను. లేకుంటే.. ఏదైనా ఆలయం దగ్గర, దాతలు ఇచ్చిన ఆహారం తిని జీవిస్తున్నాను. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి.. ఏదైనా వసతి ఏర్పాటు చేయాలని నా విజ్ఞప్తి
- శ్రీనివాసరావు, నూజివీడు
షెల్టర్ కట్టిస్తే.. బాగుంటుంది..
నేను విజయవాడ వచ్చి పదేళ్లపైనే అవుతోంది. మాది మహబూబ్నగర్. నిత్యం తాగుతావని ఇంట్లో తరచూ గొడవజరిగేది. ఇంటి నుంచి వచ్చేశా. నాకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో తెలియదు. ఇంటికి వెళ్లాలని లేదు. రోజూ ఏదోఒక పనిచేసుకుంటాను. పని దొరక్కపోతే.. దేవాలయాల దగ్గర ప్రసాదాలతో ఆ రోజు సరిపెట్టుకుంటా. దుర్గగుడి సమీపంలో ఫుట్పాత్పై ప్రతిరోజు పడుకుంటా. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తరిమేస్తుంటారు. ఏదైనా ప్రత్యేకంగా షెల్టర్ లాంటిది కట్టిస్తే.. రాత్రివేళ పడుకునేందుకు బాగుంటుంది.
- ప్రసాద్, మహబూబ్నగర్(తెలంగాణ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం