వక్రించిన విధి.. తండ్రీకుమారుల దుర్మరణం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు సంకు మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు
గ్యాస్ సిలిండర్ల లారీ దూసుకెళ్లడంతో ఘటన
ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఢీకొన్న వాహనాలు
మృతులు మాధవరావు, రామరాజు (పాత చిత్రం)
నందిగామ, న్యూస్టుడే: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు సంకు మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... ఐతవరం గ్రామానికి చెందిన చలమల మైసూర్ లారీని డ్రైవర్ రామకృష్ణ తీసుకువచ్చి జాతీయ రహదారి పక్కన ఆపారు. యజమాని ఇంటికి డ్రైవర్ వెళ్లి మాట్లాడి వచ్చి లారీకి పట్టా కడుతుండగా గ్యాస్ సిలిండర్ల లారీ వచ్చి ఢీ కొట్టింది. ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుని సర్ధుబాటు చేసుకున్నారు. తరువాత ఐతవరం గ్రామానికి చెందిన లారీ వెళ్లిపోయింది. గ్యాస్ సిలిండర్ల లారీ ఇంజిన్ స్టార్ట్ కాక ఆగిపోయింది. కీసర టోల్ప్లాజాలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్న సంకు రామరాజు(40) వచ్చి ఆగిన గ్యాస్ సిలిండర్ల లారీకి ఫొటోలు తీస్తున్నారు. ఆ సమయంలో స్థానిక తాగునీటి పథకంలో పని చేస్తున్న రామరాజు తండ్రి మాధవరావు(60) నీరు విడుదల చేసి వస్తూ.. కుమారుడిని చూసి ఆగారు. ఇద్దరూ గ్యాస్ సిలిండర్ల లారీ ఎదుట ఉన్న సమయంలో కంటైనర్ వాహనం వేగంగా వచ్చి గ్యాస్సిలిండర్ల లారీని ఢీకొట్టింది. తండ్రి, కుమారుల మీదుగా గ్యాస్ సిలిండర్ల లారీ దూసుకెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ వాహనం తరువాత ఆర్టీసీ బస్సును కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు కీసర టోల్ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై దుర్గామహేశ్వరరావు, ఏఎస్సై పొదిలి రమేష్ సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ పరిశీలించి సంతాపం తెలిపారు. మార్చురీలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మృతదేహాలకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జీవనాధారం కోల్పోయిన కుటుంబం
తండ్రి, కుమారులు చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వచ్చే కొద్దిపాటి జీతంతో గడిచిపోతున్న కుటుంబం జీవనాధారం కోల్పోయింది. మామ, భర్త మృతితో రామరాజు భార్య వీరకుమారి, ఎనిమిది, ఆరు తరగతులు చదువుతున్న కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మాధవరావు భార్య ఏడాది కిందటే మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం