న్యాయవాద వృత్తి కత్తిమీద సాములాంటిది
న్యాయ విద్య పూర్తి చేయడం సులభమే కానీ నిజజీవితంలో న్యాయవాది వృత్తి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ అన్నారు.
పట్టా అందిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్, ప్రిన్సిపల్ దివాకరబాబు
కానూరు, న్యూస్టుడే: న్యాయ విద్య పూర్తి చేయడం సులభమే కానీ నిజజీవితంలో న్యాయవాది వృత్తి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ అన్నారు. శనివారం కానూరు వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో న్యాయ విద్యపూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయవాదులకు నేర్పు, ఓర్పు అవసరమన్నారు. ప్రస్తుతం భారతదేశం డబ్ల్యూటీవోతో చేసుకున్న అగ్రిమెంటు ఆన్ సర్వీస్ ఒప్పందం ప్రకారం.. దేశంలోకి విదేశీ న్యాయవాదులు న్యాయవృత్తిలోకి ప్రవేశించడం అనివార్యమయ్యిందన్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే అందుకు తగిన నైపుణ్యాలతో పాటు, విషయ పరిజ్ఞానం 360 డిగ్రీల్లో ఉండాలన్నారు. ప్రిన్సిపల్ చెన్నుపాటి దివాకరబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.