ఎగవేతదారులకు పోలీసుల అండ
చిట్టీల పేరుతో మోసగించిన మహిళకు వైకాపా నాయకులతోపాటు పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
కొమ్ముకాస్తున్న వైకాపా నాయకులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే : చిట్టీల పేరుతో మోసగించిన మహిళకు వైకాపా నాయకులతోపాటు పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమను మోసగించిన వ్యవహారంపై బాధితులు శుక్రవారం ఉదయమే హనుమాన్జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా శనివారం రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. హనుమాన్జంక్షన్లో అనధికార చిట్టీల పేరుతో మోసగించిన ఘరానా మహిళపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంజీనగర్ కాలనీకి చెందిన షేక్ నర్గీస్ అనే మహిళ కొన్నేళ్లుగా అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ.. తమ వద్ద నుంచి నెల వాయిదాల పేరుతో వసూళ్లు చేసి, సొమ్ము ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము సక్రమంగా ప్రతి నెలా వాయిదాలు చెల్లించినా పాడుకున్న చిట్టీలకు సంబంధించిన నగదు మొత్తాన్ని ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. ఇటీవల గట్టిగా నిలదీస్తే రోజుల వ్యవధిలోనే చెల్లిస్తానని నమ్మబలికి, తీరా తమకే ఎదురు నోటీసులు జారీ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగో నగదు ఇచ్చేస్తున్నానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నర్గీస్, చిట్టీలు వేసిన మహిళల దగ్గర తాను అప్పులు తీసుకుని, చాలా వడ్డీ కట్టానని, ఇక బాకీ చెల్లించలేననే విధంగా నోటీసులు జారీ చేయించడం గమనార్హం.
ముందస్తుగానే ప్రణాళిక
నర్గీస్ కుటుంబం మొదట్నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులుగా ఉండేవారని బాధితులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఒక సోదరుడు మినహా మిగతా వారంతా వైకాపా గెలుపు కోసం పనిచేశారని పేర్కొంటున్నారు. నర్గీస్ సోదరుడు రఫీ ఎంజీనగర్ కాలనీలో యువకుల్ని సమీకరించి వంశీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, నగదు, మద్యం పంపిణీ చేయడంలో చురుగ్గా వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. తరచుగా కాలనీల్లో జూదం, కోడి పందేల శిబిరాలు కూడా నిర్వహించాడనే ప్రచారం ఉంది. మరోపక్క ఎంతోకాలం నుంచి చిట్టీలు వేయడం, అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం ద్వారా కాలనీలో దందా నిర్వహిస్తూ వచ్చిన నర్గీస్, తెదేపా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో ఇక్కడి నుంచి పలాయనం సాగించేందుకు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాలనీలో ఉన్న ఇల్లు, ఇతరత్రా ఆస్తులను అల్లుడి పేరిట బదలాయించి, నగదు, బంగారాన్ని ముందుగానే తరలించేశారని, తమకు నోటీసులు పంపి, వారు రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల తీరుపై సందేహం
తమను మోసగించిన వ్యవహారంపై బాధితులు శుక్రవారం ఉదయమే హనుమాన్జంక్షన్ పోలీసుల్ని ఆశ్రయించారు. శనివారం రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పైగా మోసగించిన మహిళ పరారీలో ఉండటం, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కొక్కరుగా రహస్య ప్రాంతాలకు జారుకుంటున్నా పట్టనట్లు వ్యవహరించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా హయాంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పూర్తిగా అంటకాగిన పోలీసులు, ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ, ఆయన వర్గీయులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్సై జనార్దన్ మాట్లాడుతూ బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. విచారణ చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెప్పపాటులో మృత్యు కాటు.. సర్పంచి దుర్మరణం
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.