కట్టు తప్పిన ఖాకీలు..!
అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు
పోలీసుల్లో పెరిగిన విచ్చలవిడితనం
అసాంఘిక శక్తులతో చెట్టపట్టాలు
ఠాణాల్లో పెచ్చుమీరిన అవినీతి
ఈనాడు, అమరావతి: అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్యులను బెదిరించి పీల్చి పిప్పి చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో అయితే పాలన పూర్తిగా గాడి తప్పింది. వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఇదీ నగరంలోని పలు స్టేషన్లలో పరిస్థితి. గత వైకాపా పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో చట్టం నీరుగారిపోయింది. వైకాపా నేతలు చెప్పిందే శాసనమన్నట్టు పలువురు పోలీసులు వ్యవహరించారు. సెటిల్మెంట్లు, సివిల్ పంచాయతీలను ఉన్నతాధికారులు అడ్డుకోలేకపోయారు. కింది స్థాయిలో జవాబుదారీతనమే కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో వీఆర్కు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. కీలకమైన శాంతి, భద్రతల విభాగంలో ఉన్న పలువురిపై వేటు పడుతోంది.
అవినీతి మరకలు.. రౌడీషీటర్లతో సంబంధాలు
నున్న స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు బరి తెగించి మరీ రౌడీషీటర్లు, గంజాయి ముఠాలతో అంటకాగుతున్నారు. వారితో తిరుగుతున్నారు. అసాంఘిక శక్తులతో కలిసి మద్యం పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. అసలే ఇది సమస్యాత్మక స్టేషన్. ఈయనపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.
భవానీపురం స్టేషన్లో ఎవరి దారి వారిదే..
నగరంలో కీలకమైన భవానీపురం స్టేషన్లో పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. ఒకరిపై మరొకరు దుష్పృచారం చేసుకునే స్థాయి వరకు వెళ్లింది. కొందరికి అసాంఘిక శక్తులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడి సీఐ కృష్ణను సరిగ్గా పోలింగ్ ముందు రోజు సీపీ రామకృష్ణ బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల కారణంగా వీఆర్కు పంపించారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత వచ్చిన సీఐ కూడా ఎక్కువ రోజులు లేరు. గత వారం సిక్ లీవ్పై వెళ్లారు. గత నెలలో మద్యం పార్టీలో ఎస్.ఐ పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. టేబుళ్లపై రెండు మందు గ్లాసులు కనిపిస్తుండగా.. యూనిఫాంలో ఉన్న పూర్వ భవానీపురం ఎస్.ఐ రవీంద్రబాబు తాపీగా సిగరెట్ తాగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇది గతంలో రవీంద్రబాబు భవానీపురం స్టేషన్లో పని చేసినప్పుడు తీసిందిగా భావిస్తున్నారు. ఆయన ఇక్కడున్నప్పుడు పలు సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. నాటి వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధితో సన్నిహిత సంబంధాలున్నాయి.
- భవానీపురం స్టేషన్లో ఎస్.ఐ. రామకృష్ణను ఇటీవల వీఆర్కు పంపించారు. ఈయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేసుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. చివరకు వేకెన్సీ రిజర్వుకు పంపించారు. రి నున్న పోలీస్ స్టేషన్లో ఇటీవల సీఐ సహాయకుడైన హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్, ఏఎస్ఐ కోటేశ్వరరావు స్టేషన్లోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్టు చెబుతున్నారు. సిబ్బంది అతికష్టమ్మీద శాంతింపచేయాల్సి వచ్చింది.
నిస్తేజంగా స్పెషల్ బ్రాంచి: నగర పోలీసు కమిషనర్కు కళ్లు, చెవులుగా ఉండాల్సిన స్పెషల్ బ్రాంచి నిస్తేజంగా మారింది. సంఘటనలు, రోజువారీ వ్యవహారాలు, స్టేషన్లలో జరిగే తతంగాలపై నిఘా పెట్టి.. సీపీకి ఎప్పటికప్పుడు నివేదించడం ఈ విభాగం బాధ్యత. ఇంతటి కీలకమైన విభాగం సమాచార సేకరణ, నిఘాలో తీవ్రంగా విఫలమవుతోంది. సమాచారం కోసం ఇతరులపై ఎక్కువ ఆధారపడడమే ఇందుకు కారణం. మూడో పక్షం నుంచి సీపీకి ఫిర్యాదులు వస్తేనే అసలు విషయం తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించండి.. లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
[ 02-07-2024]
ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేశ్ను హైదరాబాద్లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు కలిశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు.. సర్పంచి దుర్మరణం
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్ యాదవ్
-
రెవెన్యూ రికవరీ యాక్ట్తో వైకాపా అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ
-
ఆ యాప్స్లో కరెంట్ బిల్లులు చెల్లించలేరు.. కారణం ఇదే..!
-
అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్లో భారతీయులకు జైలు
-
కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. అందుకే పిచ్పై ఉన్న మట్టిని తిన్నా: రోహిత్ శర్మ