logo

ప్రేమోన్మాది శివమణికంఠకు రిమాండ్‌

విజయవాడలో ప్రేమోన్మాదంతో ప్రియురాలి తండ్రిని కత్తితో నరికి చంపిన నిందితుడు గడ్డం శివమణికంఠకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది

Published : 30 Jun 2024 05:05 IST

కృష్ణలంక(విజయవాడ): విజయవాడలో ప్రేమోన్మాదంతో ప్రియురాలి తండ్రిని కత్తితో నరికి చంపిన నిందితుడు గడ్డం శివమణికంఠకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై 302 (హత్య), 307 (హత్యాయత్నం), 354డి (వెంటపడి వేధించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటన తరువాత ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. రెండో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరచగా... విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని