కీలకంగా మారిన పోస్ట్మార్టం నివేదిక
అజిత్సింగ్నగర్ లూనా సెంటరులోని మదర్సాలో జరిగిన కరిష్మా (17) అనుమానాస్పద మృతిపై అజిత్సింగ్నగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కరిష్మా మృతిపై దర్యాప్తు ముమ్మరం
అజిత్సింగ్నగర్ (మధురానగర్), న్యూస్టుడే : అజిత్సింగ్నగర్ లూనా సెంటరులోని మదర్సాలో జరిగిన కరిష్మా (17) అనుమానాస్పద మృతిపై అజిత్సింగ్నగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కలుషిత ఆహారం వల్లే మృతి చెందినట్లు ముందుగా చెప్పినా బాలిక మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా మదర్సాలోని మిగిలిన బాలికలు, యువతులను శుక్రవారమే వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మదర్సాను అజిత్సింగ్నగర్ పోలీసులు మూసి వేసి అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు.
బాలికల వాంగ్మూలం నమోదు
కరిష్మా మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్మార్టం నివేదిక కీలకంగా మారింది. బాలిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా టీం ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్మార్టం చేయించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేనే మరణం ఎన్ని గంటలకు జరిగింది? ఏ కారణంతో సంభవించిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తరువాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అంటున్నారు. కాగా మదర్సాకు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరిష్మాతో పాటు అస్వస్థతకు గురయ్యారని చెపుతున్న బాలికల నుంచి అజిత్సింగ్నగర్ పోలీసులు శుక్రవారమే వివరాలు నమోదు చేసుకున్నారు. వారంతా బుధవారం మధ్యాహ్నం నుంచే వాంతులు, విరేచనాలు అయ్యాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. దోసకాయ కూర, దొండకాయ కూర, పెరుగన్నం తిన్నామని వారిలో ముగ్గురు బాలికలు తెలిపారు. అయితే ఎవరూ మాంసాహారం తినలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలిక ఎలా మరణించిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరణించిన తరువాతే కరిష్మాను ఆసుపత్రి తీసుకువచ్చారని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. కేసు నమోదు
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
అంతస్తుకో ధర.. గజానికో లెక్క
-
రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడని మరణశిక్ష జీవితఖైదుగా మార్పు
-
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, హరిప్రసాద్
-
లోక్సభ ప్యానెల్ స్పీకర్గా తెదేపా ఎంపీ కృష్ణప్రసాద్