వైకాపా సేవలో.. గాంధీ అర్బన్ బ్యాంకు
గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు... విజయవాడ కేంద్రంగా సహకార రంగంలో ఏర్పడింది... పర్యవేక్షణ అంతా ప్రభుత్వ సహకార వ్యవస్థదే... వేలాదిమంది డిపాజిటర్లు నమ్మకం పెట్టుకున్న ఘనత దీని సొంతం...
గత ఎన్నికల్లో ఛైర్మన్ ప్రచారం
తెదేపా కార్యాలయంపై దాడిలో ఓ డైరెక్టర్ ప్రమేయం
ఓట్ల కొనుగోలుకు నగదు లావాదేవీలు
పాలకవర్గంపై ఫిర్యాదుల వెల్లువ
ఈనాడు, అమరావతి: గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు... విజయవాడ కేంద్రంగా సహకార రంగంలో ఏర్పడింది... పర్యవేక్షణ అంతా ప్రభుత్వ సహకార వ్యవస్థదే... వేలాదిమంది డిపాజిటర్లు నమ్మకం పెట్టుకున్న ఘనత దీని సొంతం... దాన్ని నిలబెట్టుకోలేని ఛైర్మన్, కొంతమంది డైరెక్టర్లు దారి తప్పారు. . నాటి వైకాపా సేవలో తలమునకలైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది... అంతేకాదు... మొన్నటి ఎన్నికల్లో వైకాపా తరఫున ఓట్ల కొనుగోలుకు ఈ బ్యాంకు శాఖ నుంచి డబ్బులు పంపిన విషయంపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన వైకాపా హయాంలో భ్రష్టుపట్టిన రంగాలెన్నో. అన్ని వ్యవస్థల్లోనూ జోక్యం చేసుకుని.. వాటిని దారి మళ్లించి స్వప్రయోజనాలకు వాడుకున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో తాజాగా వినిపిస్తున్న పేరు గాంధీ కోపరేటివ్ బ్యాంకు. దీని పాలకవర్గం వైకాపాకు కొమ్ము కాసింది. బ్యాంకు ఖాతాదారుల్లో విశ్వసనీయత సన్నగిల్లుతుందేమోనన్న ధ్యాసే లేకుండా.. ఆ పార్టీ నాయకుల పట్ల పూర్తి పక్షపాతంగా వ్యవహరించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా మొన్నటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరఫున బ్యాంకు ఛైర్మన్ ప్రచారం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వారిలో పాలకవర్గంలోని ఓ డైరెక్టర్ ఉన్నట్టు తెలిసింది.
గతంలోనూ వివాదాలే...
ఇతర జాతీయ బ్యాంకులతో పోలిస్తే.. గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు అదనపు వడ్డీతో డిపాజిట్లను ఆకర్షిస్తోంది. ఇంటి రుణాలు, బంగారం తాకట్టు రుణాలు, విద్యా, వ్యక్తిగత రుణాలను ఇస్తోంది. విజయవాడ నగరంలో పలుప్రాంతాలతోపాటు, రూరల్లో, గుంటూరులోనూ శాఖలున్నాయి. గతంలో పలు వివాదాలు చుట్టుముట్టినప్పుడు కోపరేటివ్ రిజిస్ట్రార్ విచారణ చేశారు. గాజువాకలో కొత్త శాఖ ఏర్పాటు విషయంలో నిధులు దుర్వినియోగం అయినట్టు, ఒక స్థలం కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులొచ్చాయి. బ్యాంకు చరిత్రలోనే తొలిసారి ఛైర్మన్పై కొంతమంది అవిశ్వాసం ప్రకటించి.. తేదీ ఖరారయ్యాక రాజీ కుదుర్చుకున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో మళ్లీ వివాదాలు చెలరేగాయి. ప్రస్తుతం అవి తీవ్రరూపం దాల్చాయి. వైకాపా అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు ఉన్నతాధికారులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి.
అవినాష్కు మద్దతుగా..
మొన్నటి ఎన్నికల్లో వైకాపా తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తరఫున బ్యాంకు ఛైర్మన్ ప్రచారం చేసినట్టు తాజాగా చిత్రాలు బయటకొచ్చాయి. బ్యాంకు ఉద్యోగులు ఏ రాజకీయపార్టీకీ ప్రచారం చేయకూడదన్న నిబంధన ఉంది. అలాంటిది ఛైర్మన్ ఎలా ఉల్లంఘించారన్నది ప్రశ్న. అంతేకాదు.. బ్యాంకులో వైకాపా అనుకూల నిర్ణయాలను అమలు చేసినట్టు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ బ్యాంకు డైరెక్టర్గా ఉన్న జోగిరాజు... గతంలో తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా వెలుగు చూశాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా కార్యాలయంపై ఏడాది కిందట దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. జోగిరాజుకు మద్దతుగా ఛైర్మన్ ఉన్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ప్రచారానికి కూడా ఈ బ్యాంకు నుంచి నగదు సమకూర్చినట్టు ఫిర్యాదులున్నాయి. వైకాపా నాయకులు, కొంతమంది కార్పొరేటర్లకు ఛైర్మన్ రసీదు ఇస్తే... దాన్ని పటమట బ్రాంచిలో చూపించి నగదు తీసుకునేవారు. ఆ తరువాత వాటిని సర్దుబాటు చేసుకునేవారని తెలిసింది. పటమట శాఖ నుంచి ఇలా అనధికారికంగా దాదాపు రూ. 4 కోట్ల వరకు పంపిణీ చేసినట్టు సమాచారం. ఇలా ఎలా సర్దుబాటు చేశారనేది గోప్యంగా ఉంచారు. ఆడిట్లో బయటపడే అవకాశం ఉంది. ఇలా ఒక్క పటమట శాఖలోనే చేశారా? మిగిలిన శాఖల్లోనూ ఉందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ బ్యాంకులో ఇప్పటికీ మాజీ సీఎం జగన్ నామస్మరణ జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. సహకార చట్టం ప్రకారం నడపాల్సిన బ్యాంకులో రాజకీయాలకు పెద్దపీట వేయడంపై విమర్శలు వస్తున్నాయి. రుణాల మంజూరులోనూ వైకాపా నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లాయి.
ఎన్నికల ప్రచారం చేయకూడదు
బ్యాంకు వ్యవహారంపై డీఎల్సీవో, జిల్లా రిజిస్ట్రార్ (సహకార రంగం) కిరణ్కుమార్ను వివరణ కోరగా తాజాగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. గతంలో అవిశ్వాసానికి నోటీసు వస్తే.. తేదీ ప్రకటించామని కానీ ఎవ్వరూ రాకపోవడంతో వీగిపోయిందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి డీసీవోకు నివేదిక ఇచ్చామని చెప్పారు. బ్యాంకు పాలకవర్గం రాజకీయపార్టీల కోసం ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!