యువకుడి ఉన్మాదం.. వీధిన పడిన చిరు వ్యాపారి కుటుంబం
యువకుడి ఉన్మాదం చిరు వ్యాపారి కుటుంబాన్ని వీధిన పడేసింది. విద్యాధరపురం చెరువు సెంటరుకు చెందిన చిరువ్యాపారి కంకిపాటి శ్రీరామప్రసాద్ (57) హత్య ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది.
విజయవాడలో ఘాతుకం
విద్యాధరపురం, న్యూస్టుడే: యువకుడి ఉన్మాదం చిరు వ్యాపారి కుటుంబాన్ని వీధిన పడేసింది. విద్యాధరపురం చెరువు సెంటరుకు చెందిన చిరువ్యాపారి కంకిపాటి శ్రీరామప్రసాద్ (57) హత్య ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. నిందితులు, బాధితులు ఇరువురూ భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలోని వారే కావడంతో సీఐ ఉమామహేశ్వరరావు అప్రమత్తమయ్యారు. శుక్రవారం వేకువజామునే రెండు పోలీసు బృందాలను క్షేత్ర స్థాయికి పంపి నిందితుడి కుటుంబం వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఉన్మాద చర్య ఫలితంగా చిరువ్యాపారి కుటుంబం వీధిన పడింది. శ్రీరామప్రసాద్కు(చిల్లర కొట్టు రాము) భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధులైన తండ్రి సాంబశివరావు, తల్లి సామ్రాజ్యం కూడా ఆయనపైనే ఆధారపడ్డారు. తమ కుమార్తె జోలికి రావొద్దని మందలించడమే శ్రీరామప్రసాద్పై గడ్డం శివమణికంఠ కత్తితో తెగబడడానికి కారణం. మణికంఠ ఉన్మాద చేష్టకు ఇద్దరు యువతుల భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో పడింది. వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ ఆ కుటుంబానికి మరింత భారంగా మారింది.
వ్యాపారం పెరుగుతున్న సమయంలో..
కొవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన శ్రీరామప్రసాద్కు ఇంటి అద్దె కట్టడమే భారమైంది. వ్యాపారం క్రమంగా పుంజుకుంటున్న సమయంలో ఉన్మాది చేష్ట శరాఘాతమైంది. పెద్దల సమక్షంలో మందలిస్తే బుద్ధిగా ఉంటాడనుకుంటే కక్ష పెంచుకొని కాటు వేశాడని శ్రీరామప్రసాద్ కుటుంబం వాపోయింది. ఇద్దరు కుమార్తెల చదువులు, వివాహం చేయడానికి సైతం వారికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కలవారు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రస్తుతం బాసటగా నిలిచారు.
తొలి నుంచి దుందుడుకు స్వభావం
గుప్తా సెంటర్కు చెందిన శివమణికంఠ గట్టువెనక ప్రాంతంలో పలు పాఠశాలల్లో పీఈటీగా పనిచేశాడు. అతడి వ్యవహార శైలి నచ్చకపోవడంతో గతంలో పలు పాఠశాలల యాజమాన్యాలు అతడిని విధుల నుంచి తొలగించాయి. ప్రస్తుతం భవానీపురంలోని ప్రయివేటు పాఠశాలలో పనిచేస్తున్న మణికంఠ చిరువ్యాపారి కుమార్తె దర్శినిని పెళ్లి చేసుకుంటానని వెంటపడుతుండడంతో ఆ విషయం తండ్రికి చెప్పింది. తండ్రి స్థానిక పెద్దలను తీసుకు వెళ్లి మణికంఠను మందలించడంతో అతడు కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ప్రేమించిన యువతి సమక్షంలోనే ఆమె తండ్రిని దారుణంగా హతమార్చడం చూపరులను కలచివేసింది. ప్రయివేటు పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సహజ సిద్ధమైన దుందుడుకు స్వభావం కారణంగా రాజకీయ పక్షాల ప్రదర్శనల్లో అల్లరి చేయడం, బెదిరింపులకు దిగడం, రాజకీయ నాయకులతో సెల్ఫీలు దిగి ఇన్స్టాల్లో పెట్టి గొప్పలు చెప్పడం అతని నైజంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.