అతివల జీవితాల్లో వెలుగులు
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు ఇచ్చే రుణాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా చర్యలు తీసుకుంటుంది.
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి చర్యలు
కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు ఇచ్చే రుణాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పటివరకు ఉన్న పథకాల్లో పలు మార్పులు చేయడంతోపాటు మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.
పొదుపు నుంచి రుణాలు
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి లాంటి పథకాల ద్వారా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. కూటమి ప్రభుత్వం సంఘాల్లో సభ్యుల అవసరాల తీరేలా కొత్తగా పలు మార్పులు చేసింది. దీనిలో భాగంగానే బ్యాంకులు ఇస్తున్న రుణాలను అవసరం మేరకు వినియోగించుకుని సంఘ సభ్యుల పొదుపు నిధులను వినియోగించుకోవాలని సూచించింది. పొదుపు నుంచి తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ కూడా సంఘాలకే జమ కావడంతో అవి ఆర్థికంగా బలోపేతం అవుతాయని భావించి ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకులు సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి.వీటికి సభ్యులు చెల్లించే వడ్డీ బ్యాంకులకు వెళ్తాయి. అదే పొదుపు నుంచి తీసుకుంటే సంఘాల ఖాతాలకే జమై సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు.
ఖాతాల్లో రూ.కోట్లల్లో నిల్వలు
స్వయం సహయక సంఘాలకు చెందిన మహిళలు ప్రతి ఒక్కరూ నెలకు రూ.100లు తగ్గకుండా పొదుపు చేస్తున్నారు. ఈ మేరకు ఏడాదిలో రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పొదుపు చేస్తారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల సభ్యుల పొదుపు నిధులు బ్యాంకుల్లో రూ. కోట్లల్లో నిల్వ ఉంది. వాటి ఆధారంగానే సంఘాలకు రుణాలు ఇస్తున్నాయి. ఇకపై బ్యాంకులో పొదుపుఖాతాల్లో ఉన్న నిల్వ ఆధారంగా మహిళలకు స్వయం ఉపాది అవసరాల మేరకు రుణాలు ఇవ్వవచ్చు. ఈ అప్పును సంఘ మహిళలు సమావేశం నిర్వహించుకుని ఎంత పొదుపు ఉంది, బ్యాంకులో ఎంత ఉంచాలి, సంఘంలో ఎంతమంది సొమ్ము అవసరమనేది సంఘాల సమావేశాల్లో నిర్ణయించాలి. సభ్యుల తీర్మానం ప్రకారం బ్యాంకుల నుంచి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆసొమ్ము తీసుకుని అవసరమైన సభ్యులకు వడ్డీకి ఇస్తారు. వడ్డీతో కలిపినెలవారీవాయిదాలు తిరిగి ఆఖాతాకే చెల్లిస్తే బ్యాంకులో వీరిపొదుపులో జమ అవుతాయి.
రూ.10లక్షల వరకు వడ్డీ రాయితీ
గత వైకాపా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సున్నా వడ్డీ రుణాలు రూ.కోట్లల్లో అందిస్తున్నామని ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు మహిళలకు లబ్ధి చేకూరలేదు. సంఘాలు రూ.20లక్షల వరకు రుణం తీసుకున్నా కేవలం రూ.3లక్షలకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తింప చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.10లక్షల వరకు వడ్డీ రాయితీ అందించాలని నిర్ణయించడంతోపాటు ఆమేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎక్కువ సంఘాలకు, అధిక మొత్తం లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
అవగాహన కల్పిస్తున్నాం
నూతన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వివిధ పథకాల ద్వారా ఎక్కువ లబ్ధి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం సంఘాల పొదుపు ఖాతాల నుంచి రుణాలు తీసుకునే అంశంపై అవగాహన కల్పిస్తున్నాం. వడ్డీ రాయితీ వర్తింపు తదితర అంశాలపై అన్ని ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహించి ఎక్కువమంది వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నాం.
కనకారావు, బ్యాంకు లింకేజీ రుణాల డీపీఎం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. -
పింఛను పండగొచ్చింది
[ 01-07-2024]
‘కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈనెల ప్రతి పింఛనుదారు ఇంటిలోనూ పండగ వాతావరణమే ఉండబోతోంది. గత జగన్ ప్రభుత్వంలో ప్రతినెలా పంపిణీ చేసిన రూ.3వేల పింఛనును తాజాగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.4వేలకు పెంచారు. -
లద్దాఖ్ సైనిక ఘటనలో ఆర్మీ జవాన్ వీరమరణం
[ 01-07-2024]
దేశభక్తితో ఆర్మీలోకి వెళ్లిన ఆ యువకుడ్ని మృత్యువు కబళించి విగతజీవిగా తిరిగి వస్తున్నాడన్న సమాచారం అతడి స్వగ్రామం కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామస్థులను ఉలిక్కి పడేలా చేసింది. -
గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సమావేశం రసాభాస
[ 01-07-2024]
విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్ వేమూరి వెంకట్రావ్ను డిపాజిటర్లు నిలదీశారు. -
ఊపిరిపోసిన వర్షం
[ 01-07-2024]
జలాశయాల్లో నీరు లేకపోవడం, ఖరీఫ్ సమయం ఆసన్నం కావడంతో కాలువల్లో నీరు కొంత ఆలస్యంగా విడుదలైనా సాగుకు ఇబ్బందిలేకుండా ఉండాలని అన్నదాతలు ప్రకృతి కనికరించకపోతుందా? అన్న ఆశలో వెదసాగు చేపట్టారు. -
ఈ సారైనా కాల్వల ప్రక్షాళన జరిగేనా..?
[ 01-07-2024]
కొత్త ప్రభుత్వం వచ్చింది. పంట, మురుగు కాల్వల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క, తూడుకాడ నిర్మూలనకు జూన్లోనే నిధులు కేటాయించింది. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. -
టిడ్కో కాలనీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
[ 01-07-2024]
గుడివాడ టిడ్కో కాలనీలోని సమస్యలకు వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో కాలనీలో ఆయన ఆదివారం పర్యటించారు. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
[ 01-07-2024]
జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. -
ఉత్తరాంధ్ర జీవనానికి అద్దం.. కళింగాంధ్ర కథా జాడ
[ 01-07-2024]
ఉత్తరాంధ్ర జీవన స్థితిగతులకు ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. -
బాధ్యతగా భావించు.. శిరస్త్రాణం ధరించు..
[ 01-07-2024]
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు.. మద్యం తాగి వాహనాలు నడపుతుండటం, శిరస్త్రాణం లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు జరిగే ఏ చిన్న గాయమైనా... ప్రాణాపాయం కలిగిస్తోంది. -
ఉపాధి బకాయిల విడుదల ఎప్పుడో?
[ 01-07-2024]
వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
-
బాలికల విషాద ‘ప్రేమలు’
-
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం