logo

రమ్యకృష్ణకు కన్నీటి వీడ్కోలు

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉంగుటూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి.

Published : 29 Jun 2024 04:31 IST

పాడె మోస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు తదితరులు 

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉంగుటూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. రాష్ట్ర సీఎంగా చంద్రబాబు గెలిచిన సందర్భంగా మొక్కు చెల్లించుకునేందుకు బంధువులతో కలిసి శిర్డీ వెళ్లిన రమ్యకృష్ణ.. తిరుగు ప్రయాణంలో ఈనెల 26న రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. స్వగ్రామమైన పెద్దఅవుటపల్లికి తీసుకొచ్చిన రమ్యకృష్ణ భౌతికకాయానికి జిల్లా తెదేపా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి, బందరు పార్లమెంట్‌ అధ్యక్షురాలు స్వర్ణకుమారి, యార్లగడ్డ సతీష్, బచ్చుల సుబ్రహ్మణ్యం, విజయా డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఆళ్ల గోపాలకృష్ణారావు, చిరుమామిళ్ల సూర్యం, మండలాధ్యక్షుడు ఆరుమళ్ల కృష్ణారెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందుబాటులో లేనందున రమ్యకృష్ణ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని