చింతతీరే రోజులొచ్చాయి!
నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన పథకాల్లో చింతలపూడి ఎత్తిపోతల ఒకటి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 70 శాతం పూర్తయిన పనులను ముందుకు కొనసాగించకుండా గాలికి వదిలేసింది.
తెదేపా కూటమి రాకతో అన్నదాతల్లో ఆశలు
ఎత్తిపోతలు పూర్తయితే తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు
ఎన్ఎస్పీ మూడో జోన్ పరిధిలోని 21వ ప్రధాన ఉపకాలువ
న్యూస్టుడే - తిరువూరు, విస్సన్నపేట: నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన పథకాల్లో చింతలపూడి ఎత్తిపోతల ఒకటి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 70 శాతం పూర్తయిన పనులను ముందుకు కొనసాగించకుండా గాలికి వదిలేసింది. రైతుల ప్రయోజనాలకు దారుణంగా గండి కొట్టింది. తిరిగి తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... చింతలపూడి ఎత్తిపోతల పథకంపై సమీక్షించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబే... దాన్ని పూర్తి చేసి సాగర్ కాలువల్లో గోదావరి జలాలను పారిస్తారని రైతులు ఆశగా చెబుతున్నారు. సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఈ పథకం ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది.
- గత ఐదేళ్లలో విధ్వంసకర పాలన సాగించిన జగన్... చింతలపూడి ఎత్తిపోతలను అసలు పట్టించుకోలేదు. గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నా కళ్లప్పగించి చూశారే తప్ప.. వాటి సద్వినియోగానికి ఆలోచించలేదు. ఫలితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమైంది. సాగు నీరు లేక ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. సాగు భూములు బీళ్లుగా మారిపోయాయి.
మిగిలింది 30 శాతం పనులే
గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలోనే రూ. 3,356 కోట్లు ఖర్చు చేసి 70 శాతానికిపైగా పనులను పూర్తి చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరిట ఏడాది పాటు పనులను నిలిపేసింది. కేవలం రూ. 88.90 కోట్లు ఖర్చు చేసి చేతులు దులిపేసుకుంది. నిర్వాసితులైన రైతులకు రూ. 200 కోట్లు చెల్లించకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలో 600 ఎకరాల భూసేకరణ చేపట్టి పరిహారంగా రూ. 50 కోట్లు చెల్లించారు. మరో రూ. 49 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో సేకరించిన భూములకు రూ. 150 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. తాజాగా అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేస్తే పథకం అందుబాటులోకి వస్తుంది.
చివరి ఆయకట్టు వరకు నీరు..
తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే గోదావరి జలాలు చేరేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్మించాలని 2017లో పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా రైతులు చేసిన విజ్ఞప్తికి నాటి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. విస్సన్నపేట మండలం పిట్లవానిగూడెం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది పూర్తయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని ఏడాది పొడవునా అందించడానికి వీలవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!
[ 02-07-2024]
తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. -
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ
[ 02-07-2024]
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..
[ 02-07-2024]
లాద్దాఖ్లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కొత్త చట్టం ప్రకారం కృష్ణలంకలో తొలి కేసు
[ 02-07-2024]
ఈ నెల నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి కేసు కృష్ణలంక పీఎస్లో నమోదైంది. -
ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. -
పైవంతెన నిర్మాణ పనులతో అవస్థలు
[ 02-07-2024]
-
భార్య కాపురానికి రాలేదన్న కోపంతో ఐదు బైక్లకు నిప్పు
[ 02-07-2024]
భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఐదు బైక్లకు నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బైక్లతో పాటు ఓ కారు దగ్ధమవగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెప్పపాటులో మృత్యు కాటు
[ 02-07-2024]
కుటుంబమంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కారులో వెళ్తున్నారు. ముద్దు మాటలతో కుమార్తె సందడి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్తు కోసం కలలు కంటూ ప్రయాణం సాగిస్తున్నారు. -
స్వచ్ఛ అడుగులు వేయాల్సిందే
[ 02-07-2024]
తాగునీరు కలుషితం కారణంగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారం వ్యాపించి నలుగురు చనిపోగా సుమారు 150 మందికి పైగా అస్వస్థతకు గురై రెండేళ్లు కావస్తోంది. అయినా ఆ గ్రామంలో పరిస్థితుల్లో మార్పు అయితే కన్పించలేదు. -
వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు
[ 02-07-2024]
నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్గా నామపత్రాలు దాఖలు చేశారు. -
మళ్లీ అతిసారం కేసులు!
[ 02-07-2024]
గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గిపోయిన డయేరియా కేసులు సోమవారం మళ్లీ కొద్దిగా పెరిగాయి. ఆదివారం వరకు కేవలం ఒక్కరే ఇన్పేషెంటుగా ఉండగా సోమవారం సీహెచ్సీకి వచ్చిన ఆరుగురిని ఇన్పేషెంట్లుగా చేర్చుకున్నారు. -
పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్మార్టం నివేదిక
[ 02-07-2024]
అజిత్సింగ్నగర్ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్మార్టం నివేదికలో స్పష్టం చేశారు. -
ఇగ్నో ఎంబీఏలో కొత్త కోర్సులు
[ 02-07-2024]
ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!