‘గత అయిదేళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ’
నాటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ మండిపడ్డారు.
మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్. వేదికపై దుర్గాప్రసాద్, లక్ష్మణరావు తదితరులు
ఈనాడు డిజిటల్, అమరావతి: నాటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ మండిపడ్డారు. ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, అక్రమాలు, అన్యాయాలే. ప్రజలు ఐదేళ్లు ఓపిక పట్టి ఒక్కసారిగా అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించారన్నారు. శుక్రవారం విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘1975 జూన్ 25 ఎమర్జెన్సీ కాలంనాటి యథార్థ సంఘటనలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ‘1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. నియంతృత్వాన్ని అమలు చేసి ప్రజల స్వేచ్ఛను అణగదొక్కారు. మీడియాపై ఆంక్షలు విధించారు. లక్షల మందిని జైల్లో పెట్టించారు. దేశమంతా కారాగారంలా మారిపోయింద’ని ఆయన అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేశాయన్నారు. గతంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని సవరించిందీ.. ఎమర్జెన్సీని విధించిందీ కాంగ్రెస్సే.. నాటి విషయాలను నేటి తరం తెలుసుకోవాలన్నారు సత్యకుమార్. వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, భాజపా ఎన్జీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, జిల్లా ఆర్ఎస్ఎస్ విభాగ సంచాలకుడు కోనేరు దుర్గాప్రసాద్, భాజపా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల క్లస్టర్ ఇన్ఛార్జి కిలారు దిలీప్, సత్యమూర్తి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్
[ 01-07-2024]
వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
[ 01-07-2024]
గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు -
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. -
పింఛను పండగొచ్చింది
[ 01-07-2024]
‘కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈనెల ప్రతి పింఛనుదారు ఇంటిలోనూ పండగ వాతావరణమే ఉండబోతోంది. గత జగన్ ప్రభుత్వంలో ప్రతినెలా పంపిణీ చేసిన రూ.3వేల పింఛనును తాజాగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.4వేలకు పెంచారు. -
లద్దాఖ్ సైనిక ఘటనలో ఆర్మీ జవాన్ వీరమరణం
[ 01-07-2024]
దేశభక్తితో ఆర్మీలోకి వెళ్లిన ఆ యువకుడ్ని మృత్యువు కబళించి విగతజీవిగా తిరిగి వస్తున్నాడన్న సమాచారం అతడి స్వగ్రామం కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామస్థులను ఉలిక్కి పడేలా చేసింది. -
గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సమావేశం రసాభాస
[ 01-07-2024]
విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్ వేమూరి వెంకట్రావ్ను డిపాజిటర్లు నిలదీశారు. -
ఊపిరిపోసిన వర్షం
[ 01-07-2024]
జలాశయాల్లో నీరు లేకపోవడం, ఖరీఫ్ సమయం ఆసన్నం కావడంతో కాలువల్లో నీరు కొంత ఆలస్యంగా విడుదలైనా సాగుకు ఇబ్బందిలేకుండా ఉండాలని అన్నదాతలు ప్రకృతి కనికరించకపోతుందా? అన్న ఆశలో వెదసాగు చేపట్టారు. -
ఈ సారైనా కాల్వల ప్రక్షాళన జరిగేనా..?
[ 01-07-2024]
కొత్త ప్రభుత్వం వచ్చింది. పంట, మురుగు కాల్వల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క, తూడుకాడ నిర్మూలనకు జూన్లోనే నిధులు కేటాయించింది. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. -
టిడ్కో కాలనీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
[ 01-07-2024]
గుడివాడ టిడ్కో కాలనీలోని సమస్యలకు వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో కాలనీలో ఆయన ఆదివారం పర్యటించారు. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
[ 01-07-2024]
జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. -
ఉత్తరాంధ్ర జీవనానికి అద్దం.. కళింగాంధ్ర కథా జాడ
[ 01-07-2024]
ఉత్తరాంధ్ర జీవన స్థితిగతులకు ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. -
బాధ్యతగా భావించు.. శిరస్త్రాణం ధరించు..
[ 01-07-2024]
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు.. మద్యం తాగి వాహనాలు నడపుతుండటం, శిరస్త్రాణం లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు జరిగే ఏ చిన్న గాయమైనా... ప్రాణాపాయం కలిగిస్తోంది. -
ఉపాధి బకాయిల విడుదల ఎప్పుడో?
[ 01-07-2024]
వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర..
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ