Vijayawada: చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు.
కోర్టులో హాజరుపరిచిన పటమట పోలీసులు
రిమాండ్ను తిరస్కరించిన న్యాయాధికారి
కంటి గాయంతో బాధపడుతున్న గాంధీ (పాతచిత్రం)
న్యూస్టుడే - పటమట: తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్ అనుచరుడైన ఈశ్వరప్రసాద్ను అరెస్టు చేశారు. అతడిని రిమాండ్ కోసం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయాధికారి రిమాండ్ను తిరస్కరించారు. తనపై దాడిలో ఈశ్వరప్రసాద్ పాల్గొన్నారని గాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో అప్పట్లో ఏ3గా చేర్చి, ఆ తర్వాత పేరును తొలగించారు. అధికార వైకాపా నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఘటన జరిగిన సమయంలో ఈశ్వరప్రసాద్ లేరని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులను చూపించి ఛార్జిషీట్ను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. ప్రభుత్వం మారడంతో తాజాగా.. ఈ కేసులో కదలిక వచ్చింది. గతంలో నిందితుడిగా చేర్చి తొలగించిన వ్యక్తిని.. తాజాగా అరెస్టు చేశారు. ఈశ్వరప్రసాద్ను ఏ5గా చూపిస్తూ 307 సెక్షన్ చేర్చి ఇన్ఛార్జి కోర్టు అయిన 3వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. గతంలో 326 సెక్షన్ నమోదు చేసి.. ఇప్పుడు ఏ5కు హత్యాయత్నం సెక్షన్ జోడించడం కుదరదని న్యాయాధికారి తిరుమలరావు రిమాండ్ను తిరస్కరించారు. నిందితుడిని వదిలేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
పక్కా ప్రణాళికతోనే దాడి... 2022 సెప్టెంబరు 3న సాయంత్రం 5 గంటల సమయంలో తెదేపా నేత చెన్నుపాటి గాంధీ.. పటమటలంకలోని కొమ్మా సీతారావమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల రోడ్డులో జరుగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు పరిశీలిస్తున్నారు. తాగునీటి లీకేజీ గురించి కార్పొరేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. వైకాపా నేతలు గద్దె కల్యాణ్, సుబ్బు, లీలాప్రసాద్, వల్లూరి ఈశ్వరప్రసాద్లు గాంధీని ఆపి మా ప్రభుత్వంలో నీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు పదునైన ఆయుధంతో గాంధీ కుడికన్నుపై బలంగా పొడవడంతో తీవ్ర గాయమైంది. దీనిపై అప్పట్లో సెక్షన్ 326, 506 కింద కేసు నమోదు చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతల దాడి కేసులో అప్పట్లో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో గాయం నివేదికను సమర్పించక పోవడంతో రిమాండ్ తిరస్కరణకు గురైంది. గద్దె కల్యాణ్, లీలా కృష్ణ ప్రసాద్, సుబ్బులను నిందితులుగా చూపించారు. గాయానికి సంబంధించి నివేదిక పొందుపరచక పోవడంతో సెక్షన్ 326ను పరిగణనలోకి తీసుకోలేమనీ, నిందితులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ అప్పట్లో న్యాయాధికారి రిమాండ్ను తిప్పి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కేశినేని చిన్నిపై దాడి కేసులో నలుగురి అరెస్టు
ఎ.కొండూరు: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితులైన కంభంపాడుకు చెందిన వైకాపా వర్గీయులు కాలసాని చెన్నారావు, చిమటా రామకృష్ణ, చిమటా వెంకటేశ్వర్లు, చిమటా గోపాలరావును అరెస్టు చేసినట్లు ఎస్సై సీహెచ్.కృష్ణ గురువారం తెలిపారు. మరో నిందితుడైన మెంతుల శివకృష్ణ పరారీలో ఉన్నాడన్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కంభంపాడు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రస్తుత ఎన్డీయే కూటమి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఆయన అనుచరులపై వైకాపా ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త వైకాపా మండల యువత అధ్యక్షుడైన కాలసాని చెన్నారావు తన అనుచరులతో కలిసి రాళ్లతో దాడి చేశారు. ఎంపీని ఆయన అనుచరులను చంపుతానని బెదిరించి భయానక వాతావరణం సృష్టించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గత నెల 30న ఎ.కొండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు పైన తెలిపిన నలుగురు నిందితులను అరెస్టు చేసి తిరువూరు న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితులపై బీఎన్ఎస్ 143, 147, 341, 352, 506 రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
[ 07-07-2024]
గుడివాడ రాజేంద్రనగర్లో ఇద్దరు తాంత్రికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు -
గ‘ఘన’ కీర్తి.. కొలువుల దీప్తి!
[ 07-07-2024]
‘అంతరిక్ష పరిశధనల్లో భారత్ దూసుకెళుతోంది. రాకెట్ విడి భాగాలు సైకిల్పై మోసుకెళ్లే దశ నుంచి ఆరంభించి.. నేడు ఒకేసారి వంద ఉపగ్రహాలను నింగిలోకి పంపే స్థాయికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎదిగింది. -
భూముల కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించాలి
[ 07-07-2024]
జిల్లాలో పరిశ్రమలు, రైల్వేలైన్లు, రహదారులు వంటి అభివృద్ధి పనులకు అవసరమైన భూములు కేటాయించేందుకు తగు ప్రతిపాదనలను వారం వ్యవధిలో సమర్పించాలని కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. -
వ్యాపారి దారుణ హత్య
[ 07-07-2024]
బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు -
రేపటి నుంచే ఉచిత ఇసుక విధానం
[ 07-07-2024]
జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఆయా నిల్వల కేంద్రాల్లో (స్టాక్ యార్డుల్లో) ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామని, సాయంత్రం 6 గంటల వరకు సేవలు కొనసాగుతాయన్నారు. -
6,018 క్యూసెక్కుల నీరు విడుదల
[ 07-07-2024]
ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 17 పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నట్లు పర్యవేక్షణ డీఈ పెద్దిరాజు తెలిపారు. -
ముందే టెండరు.. అడిగేదెవరు!
[ 07-07-2024]
జలవనరుల శాఖలో పిలిచిన ఆపరేషన్ అండ్ మెయింటెన్సు టెండర్లకు కొందరు గుత్తేదారులు సిండికేట్ కోసం ప్రయత్నాలు చేశారు.ఎమ్మెల్యేల పేరుతో కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. -
ఆషాఢ సారె..అందుకో మాయమ్మ
[ 07-07-2024]
ఆషాఢమాసం తొలి రోజున పవిత్ర సారెతో మహిళా బృందాలు శనివారం దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చాయి. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. -
సహృదయానికి వందనం
[ 07-07-2024]
: మండలంలోని యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ అధ్యక్షురాలు వెలగపూడి విజయలక్ష్మి తన భర్త ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం రూ.4.50 కోట్ల విరాళంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?