Actor Prudhvi: నటుడు పృథ్వీపై వరకట్న వేధింపుల కేసు కొట్టివేత
సినీ నటుడు పృథ్వీరాజ్పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది.
కోర్టుకు హాజరైన నటుడు పృథ్వీరాజ్
ఈనాడు, అమరావతి: సినీ నటుడు పృథ్వీరాజ్పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ బుధవారం విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై నగరంలోని సూర్యారావుపేట స్టేషన్లో 2016లో సెక్షన్ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. వివాహం సందర్భంగా డబ్బు, బంగారు నగలు ఇచ్చినా.. ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో నటించేందుకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత, వ్యసనాలకు బానిసై తనను నిర్లక్ష్యం చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. 2017లో నగరంలోని రెండో ఏసీఎంఎం (అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్)లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై అప్పటి నుంచి వాదనలు జరుగుతున్నాయి. కేసుపై తుది తీర్పును న్యాయాధికారి మాధవీదేవి బుధవారం వెలువరించారు. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పు ఇచ్చారు. నటుడు పృథ్వీ బుధవారం రెండో ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
[ 29-06-2024]
దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ హామీని జగన్ తుంగలో తొక్కారు. -
వైకాపా సేవలో.. గాంధీ అర్బన్ బ్యాంకు
[ 29-06-2024]
గాంధీ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు... విజయవాడ కేంద్రంగా సహకార రంగంలో ఏర్పడింది... పర్యవేక్షణ అంతా ప్రభుత్వ సహకార వ్యవస్థదే... వేలాదిమంది డిపాజిటర్లు నమ్మకం పెట్టుకున్న ఘనత దీని సొంతం... -
మోపిదేవి ఆలయ కానుకల లెక్కింపు
[ 29-06-2024]
శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. -
కృష్ణ... కృష్ణా..!
[ 29-06-2024]
జిల్లాకో విశ్వవిద్యాలయంలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ మసకబారుతోంది. -
ప్రైవేటు బస్సులకు రాసిచ్చేశారా?!
[ 29-06-2024]
ప్రజల రాకపోకలు, వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రహదారులు నిర్మిస్తారు. కానీ ప్రైవేటు బస్సులు చూడండి హనుమాన్పేట జి.ఎస్.రాజు రోడ్డు, -
యువకుడి ఉన్మాదం.. వీధిన పడిన చిరు వ్యాపారి కుటుంబం
[ 29-06-2024]
యువకుడి ఉన్మాదం చిరు వ్యాపారి కుటుంబాన్ని వీధిన పడేసింది. విద్యాధరపురం చెరువు సెంటరుకు చెందిన చిరువ్యాపారి కంకిపాటి శ్రీరామప్రసాద్ (57) హత్య ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
అతివల జీవితాల్లో వెలుగులు
[ 29-06-2024]
మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు ఇచ్చే రుణాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా చర్యలు తీసుకుంటుంది. -
రమ్యకృష్ణకు కన్నీటి వీడ్కోలు
[ 29-06-2024]
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉంగుటూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. -
చింతతీరే రోజులొచ్చాయి!
[ 29-06-2024]
నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన పథకాల్లో చింతలపూడి ఎత్తిపోతల ఒకటి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 70 శాతం పూర్తయిన పనులను ముందుకు కొనసాగించకుండా గాలికి వదిలేసింది. -
ఎమ్మెల్యే చొరవ.. కేజీబీవీలో సమస్యల పరిష్కారం
[ 29-06-2024]
ఎ.కొండూరులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలోని దీర్ఘకాలిక సమస్యలు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు చొరవతో పరిష్కారమయ్యాయి. -
‘గత అయిదేళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ’
[ 29-06-2024]
నాటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు