సమస్యలపై నిర్వాసితుల మొర
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు.
చింతూరు, న్యూస్టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. విలీన మండలాల ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. గత వరదల సమయంలో బాధితులు ఎవరికీ సరైన సాయం అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మళ్లీ వరదలు వచ్చే వరదలు, పోలవరం నిర్వాసితుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 39 ముంపు గ్రామాలను గుర్తించిన ప్రభుత్వం చాలా మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు అధికసంఖ్యలో వినతులు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీఓలను ఆదేశించారు.
బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా..
గోదావరి, శబరి నదులకు వరదలు సంభవిస్తే విలీన మండలాల్లోని బాధితులను ఆదుకునేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ దినేశ్కుమార్ ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం వరద ముప్పుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వచ్చే వరద ఆధారంగా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి తక్షణమే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పాఠశాల భవనాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలని సూచించారు. బాధితులకు సకాలంలో తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు మండలాల్లో మూడు నెలలకు సంబంధించిన ఆహార నిల్వలు ప్రతి ఏటా నిల్వ చేస్తున్న ప్రాంతాల్లోనే సిద్ధం చేయాలన్నారు. బియ్యం, కందిపప్పు ఇతర నిత్యావసర సరకులు నిల్వ కేంద్రాలకు ఇప్పటికీ తరలించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు కొవ్వొత్తులు అందించాలని చెప్పారు. విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో బాధితులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నాలుగు మండలాల్లో రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉన్న అత్యవసర రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, అవసరమైన పనులపై వారంలోగా నివేదిక సమర్పించాలని గిరిజన సంక్షేమ, ఆర్అండ్బీ ఇంజినీర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, జేసీ ధాత్రిరెడ్డి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సూరజ్ గనోరే, కావూరి చైతన్య, ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చింతూరు ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. రక్తనాళాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. సూపరింటెండెంట్ కోటిరెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ పుల్లయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడుగుకో గుంత.. ఎప్పుడు తీరెనో చింత...
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు. -
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం
[ 07-07-2024]
నుర్మతి పంచాయతీ సిరసపల్లి, జీరుగులగొయ్యి గ్రామాలకు సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు -
మావోయిస్టు, సానుభూతిపరుల అరెస్టు
[ 07-07-2024]
ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు -
అంబులెన్సులో ప్రసవం
[ 07-07-2024]
అంబులెన్సులో గిరి మహిళ ప్రసవమైంది. కోటగున్నల గ్రామానికి చెందిన కిల్లో చిన్ని నిండు గర్భిణి. శనివారం ఈమెకు నొప్పులు అధికమవ్వడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. -
చెరువు భూమిలో కంచె
[ 07-07-2024]
ఉపాధ్యాయుడి పూర్వీకులు 70 ఏళ్ల క్రితమే వాటిని గ్రామంలోని చెరువు, ఇతర అవసరాలకు ఇచ్చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి పట్టాలు ఇవ్వడంతో ఉపాధ్యాయుడు చెరువు, చెక్డ్యాం తమదేనని దాని చుట్టూ కంచె వేయించి, దానిలో మొక్కలు వేశారు -
ఊరికి ఉపకారం
[ 07-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారిలో గోతులు పడి, వర్షాల కారణంగా బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానిని బాగు చేయాలనుకుని ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు -
మూడు మండలాల్లో సంపూర్ణత అభియాన్
[ 07-07-2024]
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, వివాదాలకు తావులేకుండా పాలన సాగిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. -
15 రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం
[ 07-07-2024]
మండలంలోని రొంపల్లి పంచాయతీ బురుగు, చినకోనెల గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు లైన్లు వేస్తున్నామని ఈపీడీసీఎల్ ఈఈ ఏవీఎన్ఎం అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.