‘చీకట్లో మగ్గుతున్నాం’
రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు.
అనంతగిరి గ్రామీణం, న్యూస్టుడే: రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. బురుగ, చినకోనెల గ్రామాల్లో కొండదొర తెగకు చెందిన 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో రాత్రి పూట విషపురుగులు, పాముల భయంతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇక్కడ రాత్రి బస ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందులు తెలుస్తాయని వార్డు సభ్యుడు సింహాచలం అన్నారు. గతంలో రాయిపాడు వద్ద పడుకుని ఉన్న ఈశ్వరరావును పాము కాటు వేస్తే ఆయన మృతి చెందాడన్నారు. బొడ్డవలస నుంచి 13 కిలోమీటర్లు దూరం విద్యుత్తు స్తంభాలు వేయాల్సి ఉండగా.. ఇటీవల కేవలం మూడు కిలోమీటర్లు దూరం మాత్రమే వేసి వదిలేశారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని కోరారు. కోటపర్తి కొత్తమ్మ, కోటపర్తి సింహాచలం, సోమెల అప్పలరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడుగుకో గుంత.. ఎప్పుడు తీరెనో చింత...
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు. -
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం
[ 07-07-2024]
నుర్మతి పంచాయతీ సిరసపల్లి, జీరుగులగొయ్యి గ్రామాలకు సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు -
మావోయిస్టు, సానుభూతిపరుల అరెస్టు
[ 07-07-2024]
ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు -
అంబులెన్సులో ప్రసవం
[ 07-07-2024]
అంబులెన్సులో గిరి మహిళ ప్రసవమైంది. కోటగున్నల గ్రామానికి చెందిన కిల్లో చిన్ని నిండు గర్భిణి. శనివారం ఈమెకు నొప్పులు అధికమవ్వడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. -
చెరువు భూమిలో కంచె
[ 07-07-2024]
ఉపాధ్యాయుడి పూర్వీకులు 70 ఏళ్ల క్రితమే వాటిని గ్రామంలోని చెరువు, ఇతర అవసరాలకు ఇచ్చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి పట్టాలు ఇవ్వడంతో ఉపాధ్యాయుడు చెరువు, చెక్డ్యాం తమదేనని దాని చుట్టూ కంచె వేయించి, దానిలో మొక్కలు వేశారు -
ఊరికి ఉపకారం
[ 07-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారిలో గోతులు పడి, వర్షాల కారణంగా బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానిని బాగు చేయాలనుకుని ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు -
మూడు మండలాల్లో సంపూర్ణత అభియాన్
[ 07-07-2024]
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, వివాదాలకు తావులేకుండా పాలన సాగిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. -
15 రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం
[ 07-07-2024]
మండలంలోని రొంపల్లి పంచాయతీ బురుగు, చినకోనెల గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు లైన్లు వేస్తున్నామని ఈపీడీసీఎల్ ఈఈ ఏవీఎన్ఎం అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
-
రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్స్టా పోస్ట్..!
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి