పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది.
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. నెల్లిమెట్ల శివారు చప్టాపై వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిమెట్ల నుంచి నెల్లిమెట్ల కాలనీ, లబ్బర్తి, లాగరాయి, కిండ్ర, కిండ్ర కాలనీ, ముంజవరప్పాడు, అనంతగిరి, చీడిపాలెం, సమీప అడ్డతీగల మండలానికి రోజూ వందలాది మంది ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. శాశ్వత వంతెన నిర్మించాలని ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడుగుకో గుంత.. ఎప్పుడు తీరెనో చింత...
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు. -
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం
[ 07-07-2024]
నుర్మతి పంచాయతీ సిరసపల్లి, జీరుగులగొయ్యి గ్రామాలకు సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు -
మావోయిస్టు, సానుభూతిపరుల అరెస్టు
[ 07-07-2024]
ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు -
అంబులెన్సులో ప్రసవం
[ 07-07-2024]
అంబులెన్సులో గిరి మహిళ ప్రసవమైంది. కోటగున్నల గ్రామానికి చెందిన కిల్లో చిన్ని నిండు గర్భిణి. శనివారం ఈమెకు నొప్పులు అధికమవ్వడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. -
చెరువు భూమిలో కంచె
[ 07-07-2024]
ఉపాధ్యాయుడి పూర్వీకులు 70 ఏళ్ల క్రితమే వాటిని గ్రామంలోని చెరువు, ఇతర అవసరాలకు ఇచ్చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి పట్టాలు ఇవ్వడంతో ఉపాధ్యాయుడు చెరువు, చెక్డ్యాం తమదేనని దాని చుట్టూ కంచె వేయించి, దానిలో మొక్కలు వేశారు -
ఊరికి ఉపకారం
[ 07-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారిలో గోతులు పడి, వర్షాల కారణంగా బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానిని బాగు చేయాలనుకుని ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు -
మూడు మండలాల్లో సంపూర్ణత అభియాన్
[ 07-07-2024]
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, వివాదాలకు తావులేకుండా పాలన సాగిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. -
15 రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం
[ 07-07-2024]
మండలంలోని రొంపల్లి పంచాయతీ బురుగు, చినకోనెల గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు లైన్లు వేస్తున్నామని ఈపీడీసీఎల్ ఈఈ ఏవీఎన్ఎం అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.