ప్రమాదకరం ఘాట్రోడ్డు ప్రయాణం
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయినకొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.
మారేడుమిల్లి- చింతూరు రహదారిలో తరచూ నిలిచిపోతున్న వాహనాలు
వాహనదారుల అవస్థలు
మారేడుమిల్లి, న్యూస్టుడే మారేడుమిల్లి మండలం
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన
కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే. దీనికితోడు ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారింది.
ప్రభుత్వ నిబంధలను ఏ మాత్రం పాటించకుండా, భారీ వాహనాల రాకపోకలపై ఎటువంటి నియంత్రణ పాటించక పోవడం వల్ల ప్రయాణం గాలిలో దీపంలా మారింది. ఈ మార్గంలో వాహనాలు అతికష్టంపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఈ రహదారిని ప్రభుత్వం అంతర్రాష్ట్ర రహదారిగా గుర్తించడంతో జిల్లాలోని విలీన మండలాలతోపాటు, సరిహద్దుల్లోని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంది. ఈ క్రమంలో రాత్రింబవళ్లు భారీ వాహనాలు తిరుగుతూనే ఉంటున్నాయి. అయితే పరిమితికి మించి పొడవు, బరువైన లోడులతో లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండడంతో ఆయా వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఎత్తయిన కొండలు ఎక్కాల్సి ఉండటం, పైగా ప్రమాదకరమైన మలుపులు ఉండడంతో ఆయా లారీలు తరచూ సాంకేతిక లోపాలకు గురై నిలిచిపోతున్నాయి.
నిబంధనలు పాటించని వాహనదారులు
తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడం, ఫలితంగా ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలపై ఆంక్షలు విధిస్తూ గతంలో కొన్ని నిబంధనలను విధించింది. మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో ప్రయాణించే వాహనాలు పొడవు 15 మీటర్లకు మించి ఉండరాదని, బరువు 35 టన్నులు మించి ఉండరాదని, వీటిని పాటించని వాహనాలను అనుమతించకూడదని నిబంధనలు విధించారు. దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డును మారేడుమిల్లి శివారు కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలను పాటించాల్సిన ప్రభుత్వ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భారీ వాహనాలు ఎటువంటి నియంత్రణ లేకుండానే యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికీ భారీ ట్రాలీ లారీలు తిరుగుతూ మలుపుల్లో ఇరుక్కుపోతున్నా పట్టించుకున్న అధికారులే కరవయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో భారీ ట్రాలీ లారీలు ఘాట్రోడ్డులో ఇరుక్కుపోవడంతో రోజుల తరబడి మిగిలిన వాహనాల రాకపోకలు నిలిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలతోపాటు, ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వీటిని తొలగించాలంటే భారీ క్రేనులు రావాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ తతంగం పూర్తయ్యేసరికి ఒక్కోసారి రెండు, మూడు రోజులు పడుతుంది. అప్పటి వరకు ‘ఎక్కడి వాహనాలు అక్కడే గప్చుప్...!’ అన్నచందంగా మారింది.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం...!
- రుద్రరాజు భీమరాజు, సీఐ, మారేడుమిల్లి
మారేడుమిల్లి - చింతూరు ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడతాం. ఆయా మలుపుల్లో తిరగడానికి ఇబ్బందులు పడే వాహనాలు గుర్తించి, వాటిపై నియంత్రణ విధిస్తాం. మిగిలిన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడుగుకో గుంత.. ఎప్పుడు తీరెనో చింత...
[ 07-07-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. -
ఏడడుగులు తడబడుతున్నాయి..!
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయాల్లో వివాహ బంధానికి కీలక స్థానం ఉంది. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి తోడూనీడగా కలిసి ఉంటామనే వైవాహిక బంధాన్ని అంతా గౌరవిస్తారు. -
సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం
[ 07-07-2024]
నుర్మతి పంచాయతీ సిరసపల్లి, జీరుగులగొయ్యి గ్రామాలకు సీఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు -
మావోయిస్టు, సానుభూతిపరుల అరెస్టు
[ 07-07-2024]
ఆంధ్రప్రదేశ్ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు -
అంబులెన్సులో ప్రసవం
[ 07-07-2024]
అంబులెన్సులో గిరి మహిళ ప్రసవమైంది. కోటగున్నల గ్రామానికి చెందిన కిల్లో చిన్ని నిండు గర్భిణి. శనివారం ఈమెకు నొప్పులు అధికమవ్వడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. -
చెరువు భూమిలో కంచె
[ 07-07-2024]
ఉపాధ్యాయుడి పూర్వీకులు 70 ఏళ్ల క్రితమే వాటిని గ్రామంలోని చెరువు, ఇతర అవసరాలకు ఇచ్చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాటికి పట్టాలు ఇవ్వడంతో ఉపాధ్యాయుడు చెరువు, చెక్డ్యాం తమదేనని దాని చుట్టూ కంచె వేయించి, దానిలో మొక్కలు వేశారు -
ఊరికి ఉపకారం
[ 07-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారిలో గోతులు పడి, వర్షాల కారణంగా బురదమయమైంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో దానిని బాగు చేయాలనుకుని ఆ స్నేహితులు నిర్ణయించుకున్నారు -
మూడు మండలాల్లో సంపూర్ణత అభియాన్
[ 07-07-2024]
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతూ, వివాదాలకు తావులేకుండా పాలన సాగిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి చెప్పారు. -
15 రోజుల్లో విద్యుత్తు సౌకర్యం కల్పిస్తాం
[ 07-07-2024]
మండలంలోని రొంపల్లి పంచాయతీ బురుగు, చినకోనెల గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు లైన్లు వేస్తున్నామని ఈపీడీసీఎల్ ఈఈ ఏవీఎన్ఎం అప్పారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?