రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం
రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు.
పాడేరు, న్యూస్టుడే: రహదారుల నిర్మాణ పనులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులపై గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, పీఐయూ, రహదారుల భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల అధికారులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మంజూరు చేసిన పనులు ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని పురోగతిలో ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో గుత్తేదారులందరికీ సమానంగా బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓలు వి.అభిషేక్, సూరజ్ గనోరే, చైతన్య, ఈఈలు డి.వి.ఆర్.ఎం.రాజు, కె.వేణుగోపాల్, బాలసుందరబాబు, కొండయ్యపడాల్, పీఐయూ ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
పాడేరులోని సుండ్రుపుట్టు కాలనీలో లబ్ధిదారులకు కలెక్టర్ దినేష్కుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. రేషన్ అందుతోందా..? ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ మురళీ, ఎంపీడీఓ సాయినవీన్, ఈఓపీఆర్డీ రమేష్, సచివాలయ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లూరి స్మారకాల అభివృద్ధిపై ఆశలు
[ 04-07-2024]
మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో చెదరని స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. గిరిజనులతో కలిసి విల్లంబులు, బాణాలతో బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు ఆయన. -
అన్నదాతలకు అండగా.. ఆదివాసీలకు తోడుగా..
[ 04-07-2024]
ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. సమస్య నుంచి ఎలా బయటపడాలన్నదే ముఖ్యమని కర్షకులకు ఆర్డీఎస్ఎస్ కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. ఆ సంస్థసీఈవో గాడి శ్రీను అలియాస్ బాలు కిసాన్ మిత్రా హెల్ప్లైన్ ప్రారంభించారు. -
రంగులు మార్చే సీతాకోకచిలుక
[ 04-07-2024]
సీతాకోకచిలుక.. దీని పేరు చెబితేనే అనేక ఆకట్టుకునే రంగులు గుర్తుకొస్తాయి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఒళ్లు జలదరించే స్థితి నుంచి అందంతో అందరినీ ఆకట్టుకునేలా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. -
ఆ ఇళ్ల సంగతేంటి?
[ 04-07-2024]
జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయి. వీటి నిర్మాణాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. జిల్లాలో పునాదుల కోసం గోతులు తవ్విన ఇళ్లే దాదాపు 15,487 వరకు ఉన్నాయి. -
సమస్యలపై నిర్వాసితుల మొర
[ 04-07-2024]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. -
‘చీకట్లో మగ్గుతున్నాం’
[ 04-07-2024]
రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదని అక్కడి ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. -
పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
[ 04-07-2024]
రెండు రోజులుగా మండలంలోని ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. వట్టిగెడ్డ జలాశయంలో నీరు అధికంగా చేరింది. -
నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!
[ 04-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం
[ 04-07-2024]
దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షం ఉండేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. -
ప్రమాదకరం ఘాట్రోడ్డు ప్రయాణం
[ 04-07-2024]
వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.
తాజా వార్తలు (Latest News)
-
రష్యాకు ప్రధాని మోదీ.. అయిదేళ్ల తర్వాత తొలిసారి
-
అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ ‘మామెరు’ ఫంక్షన్.. ఏంటీ వేడుక?
-
ఝార్ఖండ్ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
-
స్టీవ్ జాబ్స్తో కలిసి పనిచేసిన ఆ రోజులు మరిచిపోలేను: ఐఫోన్ మాజీ డిజైనర్
-
అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM